పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక మావోయిస్టు నేతలు.. రానున్న రోజుల్లో మరికొందరు..!

Wait 5 sec.

తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎదుట ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వీరు జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధమయ్యారని డీజీపీ తెలిపారు. ఆయుధాలు వదిలేసి ప్రజల్లో కలవడానికి.. కుంకటి వెంకటయ్య అలియాస్‌ వికాస్‌, మొగిలిచెర్ల వెంకట్రాజు అలియాస్‌ చందు, తోడెం గంగ అలియాస్‌ సోనీ (ఛత్తీస్‌గఢ్‌) సాధారణ ప్రజల్లో కలవడానికి నిర్ణయించుకున్నారని డీజీపీ తెలిపారు. ఈ ముగ్గురు నేతలు దక్షిణ బస్తర్‌ దళంలో కీలక స్థానాల్లో పని చేశారని తెలిపారు. మొగిలిచర్ల చందు (45) మావోయిస్టు స్టేట్‌ కమిటీ నెంబర్‌గా చేశారని వెల్లడించారు.ప్రభుత్వం పిలుపుతో.. ఈ సందర్భంగా డీజీపీ శశిధర్ రెడ్డి మాట్లాడారు. "కుంకటి వెంకటయ్య, మొగిలిచర్ల వెంకట్రాజు, తోడెం గంగ.. (ఛత్తీస్‌గఢ్‌) మావోయిస్టు పార్టీ నుంచి బయటికొచ్చి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమయ్యారు. వీరంతా మావోయిస్టు పార్టీ కమిటీ రాష్ట్ర స్థాయి నేతలు. తెలంగాణ సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య.. 1990లో పీడబ్ల్యూడీ ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలకు హాజరయ్యారు. అనంతరం అదే ఏడాది అజ్ఞాతంలోకి వెళ్లారు. పిడబ్ల్యూడీ కమాండర్‌ బాలన్న నేతృత్వంలోని దళంలో చేరారు. ఆ తర్వాత క్రమంగా పార్టీలో ఎదిగి.. 35 ఏళ్లపాటు వివిధ పదవుల్లో పనిచేశారు. కాగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని.. జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారు" అని డీజీపీ తెలిపారు.మరోవైపు, హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామానికి చెందిన మొగిలిచర్ల వెంకటరాజు(45) కూడా లొంగిపోయారని డీజీపీ తెలిపారు. "ఈయన 11 ఏళ్ల వయసులోనే విప్లవగీతాలకు ఆకర్షితుడు అయ్యారు. అనంతరం మావోయిస్టు ఉద్యమంలో చేరారు. 1993లో నర్సంపేట దళంలో చేరిన తర్వాత.. రాష్ట్రస్థాయి కమిటీలో వివిధ పదవుల్లో పనిచేశారు. కాగా ఇటీవల మావోయిస్టులతో వచ్చిన సైద్ధాంతిక విభేదాల వల్ల పార్టీ నుంచి బయటకు రావాలనుకున్నారు. ఇక పోలీసు శాఖ ఇచ్చిన పిలుపుతో.. అతడి భార్య తోడెం గంగ అలియాస్ సోనీతో కలిసి పోలీసుల ఎదుట లొంగి పోయారు" అని జీజీపీ తెలిపారు.కాగా, ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మవోయిస్టులపై భీకర దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక మావోయిస్టు నేతలు పార్టీ నుంచి బయటకు రావడం ప్రధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ మధ్యకాలంలో 403 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ పేర్కొన్నారు. ఇందులో తెలంగాణకు చెందిన 72 మంది మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన 12 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో.. 10 మంది తెలంగాణ వాళ్లే ఉన్నారని వెల్లడించారు.రానున్న రోజుల్లో మరింత మంది మావోయిస్టు కీలక నేతలు.. జన జీవన స్రవంతిలో కలుస్తారని డీజీపీ అన్నారు. మిగతా వారు కూడా త్వరగా లొంగిపోవాలని కోరారు. మావోయిస్టుల్లో విభేదాలు ఉన్న మాట నిజమేనని.. ఇటీవల ఆయుధాల అప్పగింతపై విడుదలైన లేఖ కూడా నిజమని భావిస్తున్నామని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు.. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందజేస్తామని చెప్పారు.