హాట్ టాపిక్‌గా పేర్ని నాని వ్యవహారం.. అసలేమైంది.. పోలీసులు ఏమన్నారు, మాజీ మంత్రి ఏం చెప్తున్నారు?

Wait 5 sec.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, వ్యవహారం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌లో పేర్ని నాని వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ ఇటీవల వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. మచిలీపట్నంలో పేర్ని నాని నేతృత్వంలో మెడికల్‌ కాలేజీ వద్ద నిరసనలు చేశారు. అయితే అనుమతి లేకుండా నిరసన చేపట్టారంటూ మాజీ మంత్రి పేర్నినానితో పాటు 400 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41ఏ కింద వీరందరికీ నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసులకు జవాబు ఇవ్వొద్దని వైసీపీ మచిలీపట్నం అధ్యక్షుడు మేకల సుబ్బన్న వైసీపీ వాట్సప్‌ గ్రూప్‌లో పోస్టు చేయటం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే మేకల సుబ్బన్నను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. *అయితే మేకల సుబ్బన్నను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని.. కార్యకర్తలతో కలిసి స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్‌పేట సీఐతో పేర్ని్ నాని వాగ్వాదానికి దిగారు. వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు ఎందుకు పిలుస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే పేర్ని నాని పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. *పేర్ని నానిపై పోలీసుల సీరియస్మరోవైపు పోలీస్ స్టేషన్‌లో పేర్ని నాని వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. ఆర్‌పేట సీఐతో పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా పేర్ని నాని వ్యవహరించారన్న ఎస్పీ.. ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజ్ వద్ద అనుమతి లేకుండా చేపట్టిన నిరసన కేసులో కొంత మందికి నోటీసులు ఇచ్చామన్న ఎస్పీ.. ఈ కేసు విచారణలో భాగంగానే ఏ8గా ఉన్న మేకల సుబ్బన్నను స్టేషన్‌కు పిలిపించినట్లు వివరించారు. *సుబ్బన్నను విచారిస్తున్న సమయంలోనే పేర్ని నాని గుంపుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వివరించారు.ఛాంబర్‌లోకి వచ్చి విచారణ అధికారి అయిన సీఐని బెదిరించేలా మాట్లాడారని .. దీన్ని పోలీస్ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు రావడంలో తప్పులేదన్న ఎస్పీ.. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విడిపించుకెళ్తానడం సరికాదన్నారు. పోలీసులతో గౌరవంగా మాట్లాడాలని.. గుంపులుగా వచ్చి గలాటా సృష్టించడం సరైంది కాదన్నారు.పేర్ని నాని వాదనేంటి?మరోవైపు పోలీసులు అక్రమ కేసులు పెట్టారని పేర్ని నాని ఆరోపిస్తున్నారు. సెక్షన్‌ 30 అమల్లో ఉండటంతో కేసులు పెట్టామని చెప్తున్నారన్నారు. 365 రోజులూ సెక్షన్ 30 పెడుతూ ఉంటే.. ప్రజల గొంతు వినిపించకూడదా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రమంతా సెక్షన్ 30 అమలు చేయటం వింతలా ఉందన్నారు. నోటీసుల అందుకున్నవారంతా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరాలు ఇచ్చామని.. అయినా కూడా మేకల సుబ్బన్నను మాట్లాడాలని పిలిపించి అరెస్ట్ చేశారన్నారు. ఇంట్లో పెళ్లి ఉందన్నా వినిపించుకోవడం లేదని పేర్ని నాని ఆరోపించారు. తమ పార్టీ పట్టణ అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తే ప్రశ్నించకూడదా అని మండిపడ్డారు. అలాగే వైసీపీ వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేశారని పేర్ని నాని ఆరోపించారు.