వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రం గుట్టు బయటపడినప్పటి నుంచి.. రాష్ట్ర రాజకీయాల్లో ఇదో ప్రధానాస్త్రంగా మారిపోయింది. గురించి ఇటు వైసీపీ. అటు టీడీపీ పదే పదే ఆరోపణలు, ప్రత్యారోపణలు గుప్పించుకుంటున్నాయి. ఈ క్రమంలో కల్తీ మద్యం వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్దేపల్లి జనార్ధన్ రావును గన్నవరం ఎయిర్ పోర్టులో ఏపీ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఏపీలో నకిలీ మద్యం కేసులో కీలక పురోగతి లభించింది. కల్తీ మద్యం వ్యవహారం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటి దాకా 23 మందిని నిందితులుగా గుర్తించినట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. 23 మంది నిందితుల్లో ఇప్పటి వరకూ 14 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావును కస్టడీలోకి తీసుకున్నట్లు మంత్రి వివరించారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. కల్తీ మద్యం వ్యవహారాన్ని దర్యాప్తు చేయడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్న మంత్రి కొల్లు రవీంద్ర.. మన రాష్ట్రంతో పాటుగా హైదరాబాద్‌, బెంగళూరులోనూ ఈ బృందాలు విచారణ చేస్తున్నాయన్నారు.మరోవైపు కల్తీ మద్యం గుర్తించేందుకు త్వరలోనే ప్రత్యేక యాప్ తేనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ప్రతి లిక్కర్ బాటిల్ మీద గతంలో ప్రత్యేకమైన కోడ్‌ ఉండేదన్న కొల్లు రవీంద్ర.. ఈ కోడ్ స్కాన్ చేసినప్పుడు.. ఆ లిక్కర్ ఎక్కడ తయారైంది? ఎక్కడి నుంచి ఎటు వెళ్లింది. దాని ధర ఎంత? వంటి వివరాలు తెలిసేవన్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే APTATS యాప్‌ అందుబాటులోకి తేనున్నట్లు కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ యాప్ ద్వారా మద్యం వివరాలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరోవైపు ఏపీలో 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అందిస్తున్నామని కొల్లు రవీంద్ర వివరించారు. నాటుసారా లేకుండా చేసేందుకు నవోదయ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇక కల్తీ మద్యం వ్యవహారం వెనుక ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.