బిగ్‌బాస్ ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ని ఆపేందుకు టాస్కులు.. భరణి-దివ్య కొట్టేశారుగా.. కళ్యాణ్‌కి మళ్లీ

Wait 5 sec.

బిగ్‌బాస్ సీజన్-9లో మరో కీలక ఘట్టానికి అంతా సిద్ధమైంది. అక్టోబర్ 11న శనివారం బిగ్‌బాస్ 2.0 అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లోకి రాబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బ్యాకెండ్ వర్క్ అంతా పూర్తయింది. అలానే . అయితే వైల్డ్‌కార్డ్స్ విషయాన్ని స్వయంగా బిగ్‌బాస్ ఈరోజు హౌస్‌లో అనౌన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోపై ఓ లుక్కేద్దాం.రణరంగం మీ ఊహలకి అందని ప్రదేశం.. ఈ వారం డేంజర్‌లో ఉన్నవారికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది.. వచ్చే ఫైర్ స్టార్మ్ డేంజర్‌లో ఉన్నవారిని కుదిపేస్తుంది.. ఆ ఫైర్ స్టార్మ్ ఏంటో మీకు తెలుసా.. వైల్డ్ కార్డ్స్ ఈ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు.. ఈ తుపాను నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఒకే ఒక్క ఛాన్స్.. అంటూ బిగ్‌బాస్ గట్టిగానే హైప్ ఇచ్చాడు.ఇక వైల్డ్ కార్డ్స్ అనగానే హౌస్‌మేట్స్ ముఖాల్లో అయోమయం, టెన్షన్ స్పష్టంగా కనిపించాయి. ఇక వీలైనంత వైల్డ్ కార్డ్స్‌ని ఆపే ఛాన్స్ బిగ్‌బాస్ వీళ్లకి ఇవ్వబోతున్నాడు. ఇందుకోసం సభ్యులందరినీ జంటలుగా డివైడ్ చేసి వాళ్లకి టాస్కులు పెడతాడన్నమాట. ఇందులో వీలైనన్నీ టాస్కులు గెలిచి ఎక్కువ పాయింట్లు సంపాదించాలి. వాటితో వైల్డ్ కార్డ్స్‌లో ఎంతోకొంతమందిని ఆపే అవకాశం వస్తుంది. మరి బిగ్‌బాస్ డివైడ్ చేసిన జంటల ఇలా ఉన్నాయి.భరణి-దివ్యకళ్యాణ్-తనూజరీతూ చౌదరి-డీమాన్సుమన్ శెట్టి-శ్రీజసంజన-ఫ్లోరాభరణి టీమ్ గెలుపుకెప్టెన్ రాముని, ఇమ్యూనిటీ పొందిన ఇమ్మూని మాత్రం ఈ టాస్కుల్లో భాగం చేయలేదు. ఎందుకంటే వీళ్లిద్దరూ నామినేషన్స్‌లో లేరు. కనుక ఇమ్మూని ఒక టాస్కుకి సంచాలక్‌గా పెట్టాడు. ప్రోమోలో చూపించిన ఇసుక టాస్క్‌లో జంటలన్నీ పోటీపడ్డాయి. ఏ జంట అయితే తమ సీసాని చివరివరకూ ప్లాట్‌ఫామ్‌కి టచ్ కాకుండా చూసుకుంటారో ఆ జంట ఈ టాస్కు విజేతలు అవుతారు.. అని బిగ్‌బాస్ చెప్పాడు.ముందుగా సుమన్, సంజన ఈ టాస్కు నుంచి ఔట్ అయ్యారు. ఆ తర్వాత ఇమ్మూ సంచాలక్‌గా కొన్ని సలహాలు ఇచ్చాడు. బాడీ ఇలా బెండ్ చేయొద్దు.. అంటూ కళ్యాణ్‌కి చెబితే చూడన్నా ఒకసారి నన్ను.. అంటూ కళ్యాణ్ అన్నాడు. అన్నా వెయిట్ ఉందన్నా దాని బట్టి వెళ్లిపోతుంది ఆటోమేటిక్‌గా అంటూ శ్రీజ కళ్యాణ్‌కి సపోర్ట్‌గా మాట్లాడింది. మినిమం అలా లేకపోతే కష్టం అన్నా.. అని కళ్యాణ్ అన్నాడు.ఇంతలో అన్నా భరణి అన్న అలాగే ఉన్నాడన్నా.. అంటూ శ్రీజ-కళ్యాణ్ కంప్లెయింట్ చేశారు. భరణి సార్‌ని కూడా చూడు ఒకసారి.. అని కళ్యాణ్ అంటుంటే ఇమ్మానుయేల్ దారుణం అంటూ కళ్యాణ్ వైపు చూపించాడు భరణి. దీంతో కళ్యాణ్ ఔట్ అంటూ ఇమ్మూ చెప్పేశాడు. దీంతో చివరికి ఈ టాస్కులో భరణి-డీమాన్ మిగిలారు. చివరికి భరణి-దివ్య టీమ్ గెలిచింది. దీంతో వీళ్లకి 50 పాయింట్లు దక్కినట్లు తెలిసింది.