21st Installment Date: దేశంలోని చాలా మంది రైతులు పీఎం కిసాన్ 21వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. చివరిసారిగా 20వ విడత నిధులు.. ఆగస్ట్ 2న ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి వేదికగా విడుదల చేశారు. ఇక 21వ విడత నిధులు నవంబర్- డిసెంబర్‌లో రావాల్సింది ఈసారి మాత్రం చాలా ముందుగానే రైతుల అకౌంట్లలో పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీపావళి పండక్కి ముందే రైతులకు శుభవార్త అందించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏ విడత డబ్బులైనా అర్హులందరి ఖాతాల్లో ఒకేసారి పడుతుంటాయి. కానీ ఈసారి కాస్త భిన్నంగా ఉంది.ఇటీవల భారీ వర్షాలు, సుమారు 27 లక్షల మంది రైతులకు 21వ విడత డబ్బులు ముందే అకౌంట్లో పడ్డాయి. కొంతైనా ఈ డబ్బులు వారికి పంట పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుందని కేంద్రం భావించింది. దీంతో.. ఇప్పుడు మిగతా లబ్ధిదారులకు.. దీపావళి పండక్కి ముందే అకౌంట్లో వేయాలని చూస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం ఉద్దేశించింది. ఏటా రూ. 6 వేలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కింద నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తుంటుంది. దీనిని ఒకేసారి కాకుండా.. 3 విడతల్లో 4 నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున వేస్తుంది. అయితే.. పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే కచ్చితంగా ఇ- కేవైసీ చేయించుకోవాలి. దీనిని కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ ద్వారా, పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా, పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు. ఆధార్- బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోయినా.. బ్యాంకింగ్ వివరాలు సరిగా లేకపోయినా.. అనర్హులుగా తేలినా రూ. 2 వేలు అకౌంట్లో పడకపోవచ్చు. రైతులు ముందుగానే లబ్ధిదారుల జాబితాను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సి ఉంటుంది. అక్కడ బెనిఫిషియరీ లిస్ట్‌పై క్లిక్ చేయాలి. తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం పేర్లు సెలక్ట్ చేసి.. గెట్ రిపోర్ట్‌ను సెలక్ట్ చేయాలి. అక్కడ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అక్కడ లిస్టులో మీ పేరు లేకుంటే మీ అకౌంట్లో రూ. 2 వేలు పడవని అర్థం చేసుకోవాలి. ఇటీవల అనర్హుల ఏరివేత కూడా కొనసాగుతోంది. 2019 తర్వాత భూమి కొనుగోలు చేసిన రైతులు కూడా ఈ పథకం కింద డబ్బులు పొందేందుకు అనర్హులు.