పొట్టిగా ఉన్నాడని.. బావను చంపిన బావమరిది... పెళ్లైన కొద్ది రోజులకే..

Wait 5 sec.

నవ వధూవరులను హత్య చేసిన ఘటనలు ఉన్నాయి. వేరే మతం వారిని పెళ్లి చేసుకున్నారని.. కొత్తగా పెళ్లైన దంపతులను కడతేర్చిన సందర్భాలూ ఉన్నాయి. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని.. పెద్దలు ఆగ్రహించి హత్యలకు పాల్పడ్డ ఘటనలూ అనేకం ఉన్నాయి. కానీ బావ పొట్టిగా ఉన్నాడని.. పెళ్లై కొద్ది రోజులకే చంపేశాడు ఓ బావమరిదిది. తనకు ఇష్టం లేని వ్యక్తిని చెల్లి వివాహం చేసుకోవడంతో అతిడిపై కక్షగట్టాడు. పక్కా ప్రణాళికతో స్నేహితుల సహాయం తో కత్తులతో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలంలో జరిగింది. ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా నాగ గణేష్‌కు (25) కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సంగంజాగర్లమూడిలో నివాసం ఉంటున్నాడు. అయితే ఉగ్యోగ నిమిత్తం గుంటూరు పవర్ ఆఫీసు సమీపంలోని బుడంపాడులో మూడు నెలలుగా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో దూరపు బంధువులైన తెనాలికి చెందిన కీర్తి అంజనీ దేవి అనే యువతి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లాడు గణేష్. పెళ్లిచూపుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే అంజనీదేవి సోదరుడు, ఆమె కుటుంబ సభ్యులు ఈ సంబంధం వద్దని చెప్పారు. అయినప్పటికీ ఇరువురూ కొద్ది రోజులు ఫోన్లో మాట్లాడుకుని ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 25న ఇంట్లో చెప్పకుండా పారిపోయారు. అనంతరం అమరావతి ఆలయంలో పెళ్లి చేసుకుని.. బుడంపాడులో కాపురం పెట్టారు.ప్రాణహాని ఉంది.. రక్షించండి..!తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని.. రక్షణ కల్పించాలని కోరుతూ కొత్తజంట నల్లపాడు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇరువురి కుటుంబాలను స్టేషన్‌కు పిలిపించి.. సీఐ వంశీధర్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కాగా, పోలీస్‌ స్టేషన్‌లోనే తన బావను చంపేస్తానంటూ.. వధువు అన్న దుర్గారావు హెచ్చరించారు. దూర్గారావు హెచ్చరికలను పట్టించుకోనప్పటికీ గణేష్ బయటకు ఎక్కువగా తిరగకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో పెళ్లి గుడిలో చేసుకున్నాం కాబట్టి... రిసెప్షన్ గ్రాండ్‌గా చేసుకోవాలని గణేష్ అనుకున్నాడు. అందుకోసం తన స్నేహితుడు కరుణతో కలిసి గుంటూరుకు వెళ్లి బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. కత్తులతో పొడిచి చంపిన బావమరిది..డబ్బు తీసుకుని ఇంటికి వస్తున్న గేణేష్‌ను.. మార్గమధ్యలో దుర్గారావు మరో ఇరువురుతో కలిసి అడ్డగించి గొడవపడ్డాడు. అనంతరం అందరూ గణేష్‌ను రాయితో కొట్టారు. తర్వాత కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యారు. వెంటే కరుణ గుంటూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే గణేష్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బావ పొట్టిగా ఉన్నాడనే చంపా..పరారీలో ఉన్న దుర్గారావు, అతడి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో బావ.. తన సోదరి కంటే పొట్టిగా ఉన్నాడనే చంపినట్లు దుర్గారావు నేరం అంగీకరించాడు. తన చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని.. అందుకే చంపినట్లు చెప్పాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.