రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు.. కారణం ఏంటంటే..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. బీసీల నాయకులు, సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 9 అమలుతో పాటు.. స్థానిక ఎన్నికల విధించడాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. హైకోర్టు ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు.. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో కోర్టు ప్రాంగణంలో గుమిగూడారు. రిజర్వేషన్లు, నోటిఫికేషన్‌ అంశాలపై న్యాయస్థానం స్టే విధించిన వెంటనే.. బీసీ నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. హైకోర్టు గేట్ నెంబర్ 4 వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు నిర్ణయాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. తమకు అన్యాయం జరిగిందని, బీసీలకు స్థానిక సంస్థల్లో పదవులు వస్తుంటే కొందరు ఓర్వలేక ఈ విధంగా అడ్డుకుంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించిన బీసీ సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. నిరసనకు దిగిన సంఘాల నేతలు ఈ పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ స్పందన, రాజకీయ ఆరోపణలు..హైకోర్టు తీర్పుపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ.. ఉన్నత న్యాయస్థానం నిర్ణయంతో బీసీల నోటి వద్ద ముద్దను లాగేసినట్లయిందని వ్యాఖ్యానించారు. అయితే.. వెనుకబడిన వర్గాలు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, 42 శాతం రిజర్వేషన్లను కల్పించి తీరుతామని ధైర్యం చెప్పారు. కోర్టు తీర్పు కాపీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమై తదుపరి న్యాయపరమైన చర్యలపై, ముఖ్యంగా సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీహరి తెలిపారు. అంతేకాకుండా, ఈ కేసును కోర్టులో వేయించింది బీఆర్ఎస్ అని, వారు భారతీయ జనతా పార్టీ తో కుమ్మక్కై బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కుట్ర పన్నారని ఆయన రాజకీయ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయడానికి హైకోర్టు స్టే రాకుండా ఉండటానికి ఎంతో ప్రయత్నించిందని మంత్రి శ్రీహరి చెప్పారు. ఏది ఏమైనా, న్యాయ పోరాటం ద్వారా రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించి.. స్థానిక ఎన్నికలను త్వరగా నిర్వహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.