తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్, కరీంనగర్ నగరాలకు ను పొడిగించింది. కోట్ల విలువైన పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి డిసెంబర్ నెలాఖరు వరకు అవకాశం లభించింది. ఈ గడువులోగా పనులను పూర్తి చేయకుంటే మరొక అవకాశం ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసింది. వరంగల్, కరీంనగర్ ప్రాజెక్టులకు చివరి అవకాశం గతంలో 2024 మార్చి 31 నాటికి ముగిసిన ల గడువును, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రిక్వెస్ట్‌తో పొడిగించడం జరిగింది. మొదట్లో జులై 11 వరకు గడువు ఇవ్వగా.. పార్లమెంట్ సమావేశాల్లో చేసిన విజ్ఞప్తి మేరకు, పెండింగ్‌లో ఉన్న పనులను డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయడానికి చివరి అవకాశం లభించింది.వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ టీకే శ్రీదేవి అధ్యక్షతన జరిగిన 29వ బోర్డ్ మీటింగ్‌లో ఈ తుది గడువును ప్రకటించారు. బల్దియా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, పనులను సకాలంలో పూర్తి చేయగలిగితేనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని విశ్లేషకులు అంటున్నారు. కరీంనగర్ ప్రాజెక్టుల విషయంలో కూడా ఇదే తరహా నిబంధనలు అమలు కానున్నాయి.పెండింగ్ ప్రాజెక్టుల చిక్కుముడి..2017లో ప్రారంభమైన ఈ పథకంలో కేంద్రం రూ.500 కోట్లు, రాష్ట్రం రూ.500 కోట్లు కలిపి రూ. వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడం, ప్రాజెక్టుల వివరాలు సమర్పించడంలో జాప్యం కారణంగా పనులు ఏళ్ల తరబడి నెమ్మదించాయి.కరీంనగర్ పనులు.. కరీంనగర్‌లో మొత్తం రూ.1,094 కోట్ల అంచనా నిధుల్లో రూ.115 కోట్ల విలువ చేసే 12 పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. వీటిలో టవర్ సర్కిల్ ప్రాంతంలో రూ.38 కోట్లతో చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సుందరీకరణ.. రూ.26 కోట్ల యూజీడీ ప్రాజెక్టులు, రూ.16 కోట్ల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, స్మార్ట్ క్లాస్‌రూమ్స్ వంటి ముఖ్యమైన పనులు ఉన్నాయి. కొత్తగా గడువు పెంచడంతో బల్దియా యంత్రాంగం వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంది.గ్రేటర్ వరంగల్ పనులు.. వరంగల్ సిటీలో మొత్తం రూ.944.67 కోట్లతో 108 ప్రాజెక్టులు చేపట్టగా.. రూ.328.96 కోట్ల విలువ చేసే 34 పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడం వలన రోడ్ల అభివృద్ధి, భద్రకాళి బండ్‌, వడ్డెపల్లి బండ్‌ సుందరీకరణ, మ్యూజికల్ లైటింగ్ వంటి ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రభావానికి గురయ్యాయి. సుమారు రూ.219 కోట్ల బిల్లుల చెల్లింపులు ఆగిపోవడంతో పనులు ఆగిపోయాయి. ఇప్పుడు లభించిన అదనపు సమయం ఈ పనులన్నింటినీ పూర్తి చేసి.. నిలిచిపోయిన బిల్లులను పొందడానికి ఒక అద్భుతమైన అవకాశంగా మారింది. ఈ పనులన్నీ పూర్తయితే.. హైదరాబాద్ వంటి మహానగరంతో ఈ రెండు జిల్లాలు పోటీ పడటం ఖాయం.