: ప్రస్తుతం భారత్‌లో పండగ సీజన్ కొనసాగుతోంది. దసరా ముగించుకుని దీపావళి ఉత్సవాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మరో పది రోజుల్లోనే దీపావళి వస్తోంది. పండగ షాపింగ్ చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్ (SBI Card) తమ క్రెడిట్ కార్డుదారులకు ఈ పండగ సందర్భంగా 'ఖుష్యాన్ అన్‌లిమిటెడ్' క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ ప్రత్యేక క్యాంపెయిన్‌లో భాగంగా 1250కిపైగా మర్చంట్ ఫండెడ్, క్యాష్ బ్యాక్, ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్లు తీసుకొచ్చింది. రూ.20 వేల వరకు వోచర్లు, ఉచిత అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్ వంటివి ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ-కామర్స్, జువెలరీ, ఫ్యాషన్, ఫర్నిచర్, గ్రాసరీ వంటి చాలా కేటగిరీల్లో చేసే చెల్లింపులపై ఈ ప్రత్యేక డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ వంటివి అందిస్తోంది. ఎస్‌బీఐ కార్డ్ ప్రకటన ప్రకారం..' ప్రత్యేక ఆఫర్లలో ప్రధానంగా ఈఎంఐ ఫోకస్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ఇవి కన్సూమర్ డ్యూరెబుల్స్, మొబైల్స్, ప్రముఖ బ్రాండ్స్ శాంసంగ్, హెయర్, ఎల్‌జీ, సోనీ, ఒప్పో, వివో, పానసోనిక్, వర్ల్‌పూల్, బోచ్, ఐఎఫ్‌బీ, హెచ్‌పీ వంటి ల్యాప్‌టాపులపై 27.5 శాతం వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తోంది.' అని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ ఆరమ్ కార్డుదారులు (SBI AURUM) దేశంతో పాటు ఆసియా పసిఫిక్‌లోని క్లబ్ మారియట్ హోటల్స్‌లో డైనింగ్ పొందవచ్చు. అలాగే 1000కిపైగా ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. వాటితో పాటు కాంప్లిమెంటరీ స్పా సర్వీసెస్ సైతం పొందవచ్చు. టాటా క్లిక్ లగ్జరీ కార్డు ద్వారా రూ.5 లక్షలు ఖర్చు చేస్తే రూ.5000 వరకు ఇ-గిఫ్ట్ వోచర్స్ పొందవచ్చు. నెలలో రూ.1 లక్ష ఖర్చు చేస్తే టాటా క్లిక్ వోచర్స్ రూ.1500 వరకు పొందవచ్చు. రూ.20 లక్షలు ఖర్చు చేసిన వారికి యాపిల్ ప్రీమియమ్ రీసెల్లర్ వోచర్ రూ.20000 లబిస్తుంది. ఇక (SBI Card MILES ELITE) అనేది ఒక ప్రీమియం ట్రావెల్ కార్డ్. జాయినింగ్ ఫీ రూ.4,999గా ఉంటుంది. ఈ కార్డు ద్వారా వెల్‌కమ్ గిఫ్ట్ రూ.5000 ట్రావెల్ గిఫ్ట్స్ వస్తాయి. వీటిని విమానాలు, హోటల్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. రూ.200 ఖర్చు చేస్తే 6 ట్రావెల్ క్రెడిట్స్ లభిస్తాయి. ఏడాదికి రూ.12 లక్షలు ఖర్చు చేస్తే రూ.20,000 బోనస్ క్రెడిట్స్ వస్తాయి. రూ.15 లక్షలు ఖర్చు చేస్తే పూర్తి ఫీ వెనక్కి ఇస్తారు. ఈ కార్డు దారులు ప్రియారిటీ పాస్ మెంబర్‌షిప్, సిక్స్ ఇంటర్నేషనల్, 8 డొమెస్టిక్ లాంజ్ విజిట్స్ లభిస్తాయి. 1 శాతం ఫ్యూయల్ సర్ ఛార్జ్ మాఫీ ఉంటుంది. ఫ్లిప్‌కార్డ్ ఎస్‌బీఐ కార్డ్ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ట్రావెల్ వంటి వాటిపై క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ లభిస్తాయి. రూ.500 జాయినింగ్ ఫీజుతోనే ఈ కార్డు ఇస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా అప్లై చేసుకుంటే వెల్‌కమ్ బోనస్ గా రూ.1250 వరకు బెనిఫిట్స్ వస్తాయి. అలాగే మింత్రాపై 7.5 శాతం క్యాష్ బ్యాక్, ఫ్లిప్‌కార్ట్ లో 5 శాతం క్యాష్ బ్యాక్, క్లియర్ ట్రిప్ లో 12 శాతం క్యాష్ బ్యాక్, జొమాటో, ఉబర్, నెట్ మెడ్స్, పీవీఆర్ వంటి వాటిల్లో 4 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.