పిఠాపురంపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్.. గెస్ట్ హౌస్ కూడా.!

Wait 5 sec.

ఏపీ డిప్యూటీ సీఎం. జనసేన అధినేత పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికల్లో మాత్రం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టడమే కాకుండా డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తనను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురంవాసుల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ పిఠాపురం వాసులకు అనేక రకాలుగా సాయం అందిస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గాన్ని ఏమాత్రం విస్మరించని పవన్ కళ్యాణ్.. అప్పుడప్పుడూ పిఠాపురంలో పర్యటిస్తూ స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తున్నారు.*ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో అతిథి గృహం సిద్ధమవుతోంది. పిఠాపురంలోని రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌస్‌ను పవన్ కళ్యాణ్ అతిథి గృహంగా ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో చేపట్టిన ఆధునికీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ భవనం ఇన్ని రోజులు నిరుపయోగంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ భవనాన్ని పూర్తి స్థాయిలో వినియోగించేలా అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అనంతరం కలెక్టర్ నిధులు మంజూరు చేయగా.. గత 20 రోజులుగా ఈ భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.*మరోవైపు ఈ భవనాన్ని 2009లో నిర్మించారు. పిఠాపురం జగ్గయ్యచెరువులోని ఎంపీడీవో కార్యాలయం పక్కనే, హైవేకు ఆనుకుని అరెకరా స్థలంలో దీనిని నిర్మించారు. రూ.38.50 లక్షలతో దీనిని నిర్మించగా.. 2011లో కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు. ఇందులో విశాలమైన హాలు, మూడు గదులు ఉన్నాయి. అయితే ఊరి శివారు ప్రాంతంలో ఉండడంతో పర్యాటకులకు సైతం అద్దెకు ఇచ్చే అవకాశం లేక.. ఆదాయం లేక ఈ గెస్ట్ హౌస్ నిర్వహణ భారంగా మారింది. దీంతో నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. *అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చిన సమయంలో రివ్యూలతో పాటుగా బస చేసేందుకు వీలుగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం రూ.50లక్షలు కేటాయించగా.. 20 రోజులుగా పనులు జరుగుతున్నాయి. పిఠాపురంలో ఇకపై తరుచుగా పర్యటించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించిన నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ బస కోసం దీనిని సిద్ధం చేస్తు్న్నారు.