Updates: కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన నేడు జీఎస్టీ (వస్తు సేవల పన్ను) కౌన్సిల్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నుంచి మంత్రులు కూడా ప్రాతినిథ్యం వహిస్తారు. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ పన్ను రేట్లలో సమూలంగా మార్పులు చేయడమే లక్ష్యంగా రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. 2 రోజులు జరిగిన తర్వాత.. రేపే (సెప్టెంబర్ 4) ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. . ఇక మీదట జీఎస్టీలో రెండు శ్లాబుల్నే కొనసాగించనున్నట్లు అంచనా వేస్తున్నారు. 2017 జులై 1న జీఎస్టీ వ్యవస్థ భారత్‌లో అమల్లోకి రాగా.. ఇప్పటివరకు 55 సార్లు జీఎస్టీ మండలి సమావేశమైంది. ఇది 56వది. ఈసారి తీసుకోబోయే నిర్ణయాలే జీఎస్టీలో అతిపెద్ద సంస్కరణలుగా నిలుస్తాయని భావిస్తున్నారు. >> ఇటీవల చేశారు. ఇప్పటివరకు ఎన్నో సంస్కరణలు చేయగా.. కొత్త తరం సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు. ఇందులో భాగంగా.. ముఖ్యంగా సామాన్యులు రోజువారీగా వినియోగించే వస్తువులపై పన్ను రేట్లను తగ్గించనున్నట్లు.. దీపావళికి దీనిని గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే.. కేంద్ర ఆర్థిక శాఖ కూడా దీనికి సంబంధించి ప్రతిపాదనలు విడుదల చేసింది. ఇందులో భాగంగా.. ముఖ్యంగా ప్రస్తుతం జీఎస్టీలో 0,5,12,18,28 శాతం శ్లాబులు ఉండగా.. వీటిల్లో 12, 28 శ్లాబుల్ని తొలగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జీఎస్టీ కౌన్సిల్ మంత్రులు కూడా దీనికి సంబంధించి సంకేతాలు ఇచ్చారు. . దీనికి కేంద్రం కూడా ఆమోదం తెలిపిందని తెలిసింది. శ్లాబులకు సంబంధించి ఇదే నిజమైతే గనుక.. అప్పుడు ఎక్కువ శాతం శ్లాబు కింద ఉన్న వస్తువులు.. దిగువ శ్లాబుల్లోకి చేరి రేట్లు తగ్గుతాయని భావించవచ్చు. ప్రధానంగా పన్ను రేట్లను తగ్గించడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా వినియోగం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. పరిశ్రమ వర్గాలు కూడా దీనిని స్వాగతిస్తున్నాయి. కొన్ని ఎన్డీయేతర పాలిత రాష్ట్రాలు మాత్రం నష్టాన్ని పూడ్చేందుకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నాయి. ప్రభుత్వం కొత్త ప్రతిపాదన అమలైతే అప్పుడు 12 శాతం శ్లాబ్ వస్తువులు 5 శాతం శ్లాబులోకి చేరొచ్చు. ఇక 90 శాతం వరకు 28 శ్లాబులో ఉన్న వస్తువులు.. 18 శాతానికి వస్తాయి. చాలా వరకు కంపెనీలు ఇప్పటికే.. జీఎస్టీ రేట్ల కోత ప్రయోజనాల్ని కస్టమర్లకు బదిలీ చేస్తామని స్పష్టం చేశాయి. ఇందులో దిగ్గజ బ్రిటానియా కంపెనీ కూడా ఉంది.సామాన్యులు రోజువారీగా వినియోగించే (నిత్యావసరాలు) టూత్‌పేస్ట్, షాంపూలు, టాల్కమ్ పౌడర్స్ వంటివి ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ శ్లాబుల్లో ఉండగా.. ఇవి 5 శాతం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. టీవీలు, ఏసీ వంటి ఎలక్ట్రానిక్స్ 28 శాతం శ్లాబులో ఉండగా.. 18 శాతం శ్లాబులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరగా నిర్ణయం వస్తే వెంటనే ధరలు తగ్గి.. పండగ సీజన్‌లో విపరీతంగా సేల్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా హైబ్రిడ్ కార్లపై 28 శాతం నుంచి 18 శాతానికి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇంకా 350 cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్స్‌పైనా జీఎస్టీ రేట్లు తగ్గనున్నాయి. పెద్ద SUV, లగ్జరీ కార్లు వంటి వాటిపై ఎక్కువ శాతం పన్ను రేట్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంకా పొగాకు, సిగరెట్ వంటి ఇతర హానికారక, విలాస వస్తువులపై 40 శాతం జీఎస్టీ విధించే అవకాశాలు ఉన్నాయి.