ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే సిమెంటు, స్టీలు ఇవ్వండి: డిప్యూటీ సీఎం భట్టి

Wait 5 sec.

తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సిమెంట్, స్టీలు పరిశ్రమలను కోరారు. ఈ పథకాన్ని విజయవంతం చేయడంలో పరిశ్రమల పాత్ర కీలకమని ఆయన వెల్లడించారు. మంగళవారం సెక్రటేరియట్‌లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి సిమెంట్, స్టీలు పరిశ్రమల యజమానులు, ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ పథకానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకు, నాణ్యతలో రాజీ పడకుండా అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఈ భారీ ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభమైందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం ద్వారా ఇళ్లు లేని పేదలకు సొంత ఇల్లు సమకూరుతుందని.. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని చెప్పారు. మానవీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశ్రమలు తమ వంతు సహకారం అందించాలని డిప్యూటీ సీఎం భట్టి కోరారు.మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం దేశంలోని అన్ని ప్రధాన సిమెంట్, స్టీలు కంపెనీల నుంచి నిర్మాణ సామగ్రిని సమీకరిస్తున్నట్లు తెలిపారు. కంపెనీలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఒకే ధరకు సిమెంట్, స్టీలును సరఫరా చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సామగ్రి ధరలను పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు సిమెంట్ కంపెనీలు అందిస్తున్న ధరలపై మంత్రులు సమీక్షించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంత సామగ్రి అవసరమో అధికారులు వివరించారు. 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి సుమారు 50 లక్షల టన్నుల సిమెంట్, 2.75 లక్షల టన్నుల స్టీలు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఈ భారీ పరిమాణంలో సామగ్రి అవసరం కావడంతో, పరిశ్రమల సహకారం అనివార్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి ఒక చారిత్రక ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశం లభించడం తమకు అదృష్టంగా భావిస్తున్నామని సిమెంట్, స్టీలు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. త్వరలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించి, ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ భాగస్వామ్యం విజయవంతమైతే ఇందిరమ్మ ఇళ్ల పథకం సకాలంలో, నాణ్యతతో పూర్తయ్యే అవకాశం ఉంది.