సీఏఏపై కేంద్రం కీలక నిర్ణయం.. పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్ మైనార్టీలకు భారీ ఊరట

Wait 5 sec.

పాకిస్తాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ వంటి ముస్లిం దేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొని.. ప్రాణాలు అరచేత పట్టుకుని.. భారత్‌లోకి వలస వచ్చిన మైనారిటీలకు కేంద్ర హోంశాఖ భారీ ఊరట కల్పించింది. ఈ 3 దేశాల్లో హింసను తప్పించుకుని.. భారత్‌లోకి వచ్చిన మైనారిటీ వర్గాలైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు ఉపశమనం ఇచ్చింది. పాస్‌పోర్ట్ లేదా ఇతర ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండానే భారతదేశంలో ఉండేందుకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.అయితే మొదట 2014 డిసెంబర్ 31వ తేదీ నాటికి భారత్‌లో అడుగు పెట్టిన వారికి మాత్రమే.. భారత పౌరసత్వం ఇస్తామని.. గతేడాది అమల్లోకి వచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టం 2024లో పేర్కొన్నారు. కానీ తాజాగా ఈ చట్టంలోని నిబంధనలను కాస్త సడలిస్తూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 డిసెంబర్ 31వ తేదీ వరకు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల నుంచి భారత్‌లోకి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.గతేడాది అమల్లోకి వచ్చిన ప్రకారం.. లభిస్తుంది. ఇమ్మిగ్రేషన్, విదేశీయుల చట్టం 2025 కింద తాజా ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో 2014 తర్వాత భారత్‌కు వలస వచ్చిన ఈ 3 దేశాల ముస్లిమేతర మైనారిటీలకు.. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులకు ఉపశమనం కలగనుంది. వీరందరికీ పాస్‌పోర్ట్, వీసా కలిగి ఉండాలనే నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని హోం మంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది.తాజా నిర్ణయంతో 2024 డిసెంబర్ 31 లోపు భారత్‌లోకి వలస వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధికారిక గుర్తింపు పత్రాలు లేకున్నా.. వారంతా భారత్‌లో నివసించవచ్చని తెలిపింది. ఈ నిర్ణయంతో అలాంటివారికి న్యాయపరంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ నిర్ణయంతో గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో కాందిశీకుల్లా నివసిస్తున్న వారు గౌరవంగా జీవించవచ్చని.. వారు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాకపోకలు సాగించవచ్చని.. ఆస్తులు కూడా కొనుగోలు చేయవచ్చని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వలస వచ్చిన శరణార్థులకు పత్రాలు లేకపోయినా.. వెంటనే పౌరసత్వం ఇచ్చేలా పౌరసత్వ సవరణ చట్టం-2019ని గతేడాది కేంద్రం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సీఏఏ-2019 చట్టం ప్రకారం.. ఈ 3 దేశాల నుంచి వచ్చిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.