ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు నామినేటెడ్ పదవులు ఉన్నవారికి కేబినెట్ హోదా కల్పించారు. ఈ మేరకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్.జవహర్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్‌లకు . ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వివిధ కార్పొరేషన్లు, బోర్డుల ఛైర్మన్‌ల జీతాలను కూడా నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం 12 కార్పొరేషన్ల ఛైర్మన్‌లను A కేటగిరీలో చేర్చింది. ఆరు సంస్థల ఛైర్మన్‌లను B కేటగిరీలో చేర్చింది. A కేటగిరీ ఛైర్మన్‌లకు నెలకు రూ.1.25 లక్షల జీతం.. అలవెన్సులు కూడా కలిపి రూ.2,77,500 ఉంటాయి. B కేటగిరీ ఛైర్మన్‌లకు నెలకు రూ.60వేల జీతంతో పాటుగా.. అలవెన్సులు కలిపి రూ.1,93,500 చెల్లిస్తారు.ఏపీ ప్రభుత్వం అప్డేట్స్రాష్ట్ర ప్రభుత్వం PMAY 2.0 పట్టణ పథకానికి రూ.405 కోట్లు విడుదల చేసింది. ఈ డబ్బుతో పట్టణాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తారు. కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి 50 వేల ఇళ్లు ఇచ్చింది. లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. ఈ నెల మూడో వారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తాయి. పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని అధికారులు తెలిపారు.. త్వరలోనే ఇళ్ల నిర్మాణం మొదలవుతుంది.నేషనల్ అకడమిక్ డిపాజిటరీ- అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC) ప్లాట్‌ఫామ్‌లో విద్యా రికార్డులను అప్‌లోడ్ చేసే గడువును నవంబర్ 30 వరకు పొడిగించారు. ఉన్నత విద్యార్థులు తమ క్రెడిట్లు, సర్టిఫికెట్లను భద్రంగా ఉంచుకోవచ్చని.. అలాగే వాటిని బదిలీ కూడా చేసుకోవచ్చని విద్యామండలి ఛైర్మన్ మధుమూర్తి తెలిపారు. ఈ విషయంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యాసంస్థలకు సూచించారు. విద్యార్థుల క్రెడిట్లు, పత్రాలు భద్రంగా ఉండటానికి ఈ అవకాశం ఉపయోగపడుతుంది. వాటిని ఒక విద్యాసంస్థ నుండి మరొక విద్యాసంస్థకు బదిలీ చేసుకోవచ్చు. యూనివర్శిటీలు, కాలేజీల నోడల్ అధికారులకు ఇప్పటికే మూడు వర్క్‌షాప్‌లు నిర్వహించామన్నారు. అన్ని విద్యాసంస్థల నోడల్ అధికారులు, పరీక్షల విభాగం అధికారులు దీన్ని వెంటనే పూర్తి చేయాలని సూచించారు.