మరోసారి బ్యాంకుల విలీనం.. సగానికి సగం తగ్గనున్నాయ్..! దూసుకెళ్తున్న బ్యాంకింగ్ స్టాక్స్

Wait 5 sec.

with SBI PNB: సోమవారం సెషన్‌లో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో మంచి లాభాల్లోనే ప్రారంభమైనప్పటికీ.. కాసేపటికే కాస్త వెనక్కి మళ్లాయి. ప్రస్తుతం వార్త రాసే సమయంలో (ఉదయం 10.45 గంటలకు) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో 84,670 స్థాయిలో కదలాడుతోంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ చూస్తే 20 పాయింట్లు పెరిగి 25,930 స్థాయిలో ఉంది. ఇవాళ ప్రధానంగా హెవీ వెయిట్ స్టాక్స్ రాణిస్తున్నాయి. ఇంకా బ్యాంకింగ్ స్టాక్స్ రాణిస్తున్నాయి. వీటిల్లో ముఖ్యంగా ప్రభుత్వ రంగ దూసుకెళ్తున్నాయని చెప్పొచ్చు. .. వీటిల్లో షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. >> సెంట్రల్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు సహా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటివి సోమవారం సెషన్‌లో 4 శాతం వరకు దూసుకెళ్లాయి. దీంతో వీటిల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలు వస్తున్నాయని చెప్పొచ్చు. కిందటి సెషన్‌లో రూ. 30.14 వద్ద క్లోజ్ అయిన పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ షేరు ఇవాళ 4 శాతానికిపైగా పెరిగి రూ. 31.40 వద్ద గరిష్టాన్ని తాకింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ షేర్ ధర కూడా 4 శాతం వరకు పెరిగి రూ. 39.49 వద్ద సెషన్ గరిష్టాన్ని నమోదు చేసింది. 4 శాతానికిపైగా పెరిగి రూ. 32 వద్ద గరిష్టాన్ని తాకింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్ ధర 4 శాతం వరకు పెరిగి రూ. 60.30 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. వీటితో పాటు.. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా అన్నీ మంచి లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.>> రచిస్తోందని.. ఏప్రిల్- మే సమయంలో దీనిపై ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు. ఇన్‌ఫార్మిస్ట్ రిపోర్ట్ ప్రకారం.. ఈ విలీనం ఒకే విడతలో కాకుండా.. 2-3 దశల్లో జరగొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 12 గా ఉండగా.. వీటిల్లో చిన్న బ్యాంకుల్ని ఇతర పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయడం ద్వారా సగానికి సగం (6-7) తగ్గించొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఎక్కువగా ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో.. ఇతర చిన్న బ్యాంకులు యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి వాటిని విలీనం చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.