డిశ్చార్జ్ అయ్యాడు. ఆదివారం డిశ్చార్జ్ అయిన హోటల్‌కు తిరిగి చేరుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో గిల్ బ్యాటింగ్‌కు రాకపోవడంతో ఆందోళన నెలకొంది. శనివారం గాయం తీవ్రంగా మారిన సమయంలో గిల్‌ను కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ఐసీయూలో ఉంచి పర్యవేక్షించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం గిల్ పూర్తిగా స్థిరంగా ఉన్నాడు, పెద్దగా అసౌకర్యం లేకుండా నడవగలిగాడు, మెడను కదిలించగలిగాడు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆస్పత్రికి వెళ్లి గిల్‌ను సందర్శించి, సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడాడు.జట్టు హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్న గిల్ పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. అయితే నవంబర్ 22న గువాహటిలో ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌లో పాల్గొనగలడా లేదా అనేది స్పష్టతకు రాలేదు. ముందు రోజు గిల్ గాయంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ “ఫిజియో ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. ఈ సాయంత్రం ఒక నిర్ణయం తీసుకుంటారు. రేపటికి స్పష్టత వస్తుంది” అని తెలిపాడు.వాషింగ్టన్ సుందర్ అవుటవడంతో మొదటి ఇన్నింగ్స్‌లో గిల్ క్రీజులోకి వచ్చాడు కానీ మూడే బంతులు ఆడిన తరువాత మెడ నొప్పి తీవ్రం కావడంతో వెంటనే మైదానం విడిచిపోయాడు. గిల్ క్రీజులో లేకపోవడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సమయంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును నడిపించాడు.గిల్ లేకపోవడం మ్యాచ్‌పై చాలా పెద్ద ప్రభావం చూపింది. దక్షిణాఫ్రికా భారత్‌పై 30 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. స్పిన్నర్ సైమన్ హార్మర్ ఎనిమిది వికెట్లు తీయడం, టెంబా బావుమా ఆడిన ధైర్యవంతమైన అర్ధశతకం మ్యాచ్‌ను సఫారీల వైపు తిప్పాయి. 2012 డిసెంబర్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఎదుర్కొన్న ఓటమి తరువాత ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌కు ఇది తొలి పరాజయం కావడం గమనార్హం.బ్యాటింగ్‌లో బలహీనంగా ఉన్న భారత్‌కు కెప్టెన్ గిల్ దూరమైతే మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. గిల్ మొదటి టెస్టులో ఆడుంటే ఫలితాలు మరోలా ఉండేవి. గిల్ రెండు ఇన్నింగ్స్‌లలో ఆడలేదు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కనీసం బ్యాటింగ్‌కి రాలేదు. దాంతో భారత్ కేవలం 30 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. ఇలాంటి సందర్భంలో భారత్‌కు రెండో టెస్టు చాలా కీలకంగా మారింది. మరి గిల్ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.