కౌశిక్ రెడ్డికి లైఫ్ ఇచ్చిందే మేం.. ఇక విశ్వరూపమే, మేమేందో సూపిస్తాం: నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం

Wait 5 sec.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ సాధించిన సంగతి తెలిసిందే. నగరంలో పేరున్న కుమారుడు నవీన్ యాదవ్.. ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచార సమయంలో చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబంపై పలువురు బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. రౌడీ కుటుంబం అంటూ ప్రచారం చేశారు. అయినా.. జూబ్లీ ఓటర్లు నవీన్ యాదవ్‌కు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయం తర్వాత శ్రీశైలం యాదవ్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తమపై లేనిపోని నిందలు వేశారని.. తామేంటో ఇక నుంచి చూపిస్తామని సంచలన కామెంట్స్ చేశారు. 'హైదరాబాద్‌లో రౌడీయిజం లేదు. మేమే కాదు ఎవరూ చేయరు. మేం మంచికి మంచి.. చెడుకు చెడు. కేటీఆర్ ఏదో మాట్లాడుతుండు. నేను ఖాయం. తెలంగాణ భవన్‌కు బుల్డోజర్ పంపి తీరుతా. పంపకపోతే నా పేరు శ్రీశైలం యాదవ్ కాదు. కేసీఆర్ కాపాల ఉన్నోళ్లం మేం.. అలాంటింది ఇప్పుడు రౌడీలం అయినమా.. ఒక నాలుగైదు రోజులైనంక నా విశ్వరూపం చూపిస్తా. రౌడీయిజం కాదు.. అంతా లీగల్‌గానే. మేం వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తాం. మంచి చేస్తే ఎవరికైనా సపోర్ట్ చేస్తాం. పాడి కౌశిక్ రెడ్డికి లైఫ్ ఇచ్చిందే మేము. నవీన్‌కు కౌశిక్ దోస్త్. కాలేజీలో కౌశిక్ రెడ్డిని కొట్టిన్రు. అప్పుడు కాపాడింది మేం. కౌశిక్ రెడ్డి రంజీ మ్యాచ్ ఆడించిందే మేం. అలాంటి మాపై రౌడి ముద్ర వేసిన్రు. మా నుంచి లబ్ధి పొందినోళ్లే కారు కూతలు కూస్తున్నరు. , జీవన్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరు. నేను ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు.. తడాఖా చూపిస్తాం. టీఆర్ఎస్ భవన్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టిస్తా. ఆయన ఇంటిని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు ఇచ్చిండు. పెద్దాయన కొండాను రోడ్డు పాలు చేసిన్రు. టీఆర్ఎస్ భవన్‌ను పేరు మార్చి బీసీ భవన్‌గా మారుస్తా. వాళ్లందరికీ నేను ఒక్కడినే చాలు. 1998లోనే నేను ఎమ్మెల్యే కావాల్సి ఉంది. టీడీపీ టికెట్ జస్ట్ మిస్ అయింది. ఇప్పుడు నా కొడుకు ఎమ్మెల్యే అయిండు. నేను పూలే కమిటీకి ఛైర్మన్ ఉన్నా.. బీసీలు నన్ను గౌరవిస్తరు. అన్ని కులాలు రాజకీయంగా ఎదగాలనేది నా ఉద్దేశ్యం. నేను ఎమ్మెల్సీ అయి తీరుతా.. కచ్చితంగా ఎమ్మెల్సీ అయితా.. నేను చాలా మందిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేశా. అవసరం వచ్చినప్పుడు నేనూ ఎమ్మెల్సీ అయితా.. అవసరమైతే బీఆర్ఎస్ వాళ్లతోనే నేను ఎమ్మెల్సీ అయితా. కేసీఆర్ ఉన్నంత కాలమే బీఆర్ఎస్. ఆ తర్వాత అది అయిదు ముక్కలైతది. కేటీఆర్, హరీష్, కవిత, ఉద్యమకారులం, బీసీలం ఇలా అందరికీ ఆ పార్టీల హక్కుంటది.' అని చిన్న శ్రీశైలం యాదవ్ వెల్లడించారు.