Asia Cupలో మళ్లీ కొనసాగిన నో హ్యాండ్ షేక్ వివాదం.. భారత్‌పై పాకిస్తాన్ ఘన విజయం

Wait 5 sec.

భారత్ - పాకిస్తాన్ మధ్య వేదిక ఏదైనా మాత్రం కొనసాగుతూనే ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న సంఘటనలతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. తొలిసారిగా సెప్టెంబర్‌లో దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో పాకిస్తాన్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. మహిళల వన్డే వరల్డ్ కప్‌లోనూ ఇదే కొనసాగగా.. తాజాగా లోనూ నో హ్యాండ్ షేక్ కంటిన్యూ అయింది. ఖతర్‌లోని దోహా వేదికగా ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 గ్రూప్ బీలో భారత్ ఏ - పాకిస్తాన్ ఏ జట్లు ఆదివారం తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఆరంభంలో టాస్ వేసే సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు జితేశ్ శర్మ, ఇర్ఫాన్ ఖాన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. మ్యాచ్ అనంతరం కూడా భారత్ - పాక్ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండానే తమ తమ డగౌట్‌ల వైపు వెళ్లారు. ఆసియా కప్‌తో మొదలైన ఈ వివాదం ఇంకెంత కాలం కొనసాగుతుందో చూడాలి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 ఆరంభ మ్యాచ్‌లో యూఏఈపై రికార్డు స్కోర్ నమోదు చేసిన భారత్, పాకిస్తాన్‌పై మాత్రం తేలిపోయింది. పాకిస్తాన్ బౌలర్ల ధాటికి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బాస్ బేబీ వైభవ్ సూర్యవంశీ మాత్రం తనదైన స్టయిల్‌లో దీటుగా సమాధానం చెప్పినప్పటికీ, మిగతా ప్లేయర్లు ఎవ్వరూ రాణించకపోవడంతో చాలా తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. కెప్టెన్ జితేశ్ శర్మ, ఓపెనర్ ప్రియాన్షు ఆర్య, నేహాల్ వధేరా, అశుతోష్ శర్మ, రమణదీప్ సింగ్ ఇలా హిట్టర్లు అంతా దారుణంగా విఫలమవ్వడంతో పాకిస్తాన్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ చేతులెత్తేసింది. వైభవ్ సూర్యవంశీ 45, నమన్ ధీర్ 35, హర్ష్ దుబే 19, రమణదీప్ సింగ్ 11, ప్రియాన్షు ఆర్య 10 మినహా మిగతా ఏ ప్లేయర్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. దాంతో భారత్ 19 ఓవర్లలో కేవలం 136 పరుగులకే ఆలౌట్ అయింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఏ జట్టుకు ఓపెనర్ మాజ్ సాదాఖత్ అద్భుత ఆరంభం ఇవ్వడం కలిసొచ్చింది. మాజ్ 47 బంతుల్లో 7 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 79 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో పాకిస్తాన్ జట్టు 13.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 137 పరుగులు సాధించింది. ఈ విజయంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌కి వెళ్లగా.. భారత్ ఒమన్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.