మహిళా సంఘాలకు సర్కార్ బంపరాఫర్.. ప్రతి నెలా రూ.70 వేలు.. నేరుగా ఖాతాలో జమ

Wait 5 sec.

తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ మహిళా సాధికారితకు పెట్ట పీట వేస్తోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరలుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం అనేక రకాల పథకాలు అమలు చేసేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో మహిళా సంఘాల కోసం దేశంలోనే మొదటిసారి ఒక పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా వారి ఖాతాలో ప్రతి నెల రూ.70 వేల జమకానున్నాయి. ఆ వివరాలు..తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే బస్సుల ద్వారా వారిని కోటీశ్వరులుగా మార్చాలని నిర్ణయించుకుంది. బస్సులను కేటాయించి.. వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి.. ప్రతి నెలా రూ.70 వేల వరకు ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వ హామీ మీద వడ్డీలేని రుణాలు ఇవ్వనుంది. అద్దె మొత్తాన్ని మహిళా సంఘాల ఖాతాలో జమ చేస్తూ.. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సర్కార్ చర్యలు తీసుకుంటుంది. మహబూబాద్ జిల్లాలో ఇప్పటికే ఈ పథకం అమలవుతోంది. జిల్లాలోని 9 మండల సమాఖ్యలు బస్సులను కొనుగోలు చేయగా.. వీటిల్లో మూడింటిని ఇప్పటికే ఆర్టీసీ డిపోలకు అద్దెకు ఇచ్చారు. ఆరు బస్సులను మహబూబాబాద్‌ డిపోకు అద్దెకివ్వగా.. నర్సంపేట, తొర్రూరు, భూపాలపల్లి ఆర్టీసీ డిపోలకు ఒక్కో బస్సు చొప్పున అద్దెకు ఇచ్చారు. ఒక్క బస్సు కొనుగోలుకు రూ.36 లక్షలు ఖర్చవుతుంది. వీటిని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా సెర్ప్‌ అధికారులు ఆర్టీసీతో ఒప్పందం చేసుకుని.. బస్సులను రెంట్‌కు ఇచ్చారు. ఇందుకు గాను ఆర్టీసీ.. ఒక్కో బస్సుకు నెలకు రూ.69,400 చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని మండల సమాఖ్య ఖాతాల్లో జమ చేస్తున్నారు.నెలకు ఒక్కో బస్సు మీద రూ.69,400 చొప్పున తొమ్మిది బస్సులకు గాను ప్రతి నెలా రూ.6,24,600 ఆదాయం సమకూరుతోంది. సంవత్సరానికి సుమారు రూ.75 లక్షలు మహిళా సమాఖ్యల ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటివరకు అంటే గత 8 నెలలకుగాను దాదాపు రూ.50 లక్షల వరకు మహిళా సమాఖ్యా ఖాతాల్లో జమయ్యాయి. సర్కార్ దేశంలోనే తొలి సారి.. మండల మహిళా సమాఖ్యల ఆదాయాన్ని పెంచడం కోసం.. SERP ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసి.. వాటిని తెలంగాణ ఆర్టీసీకి అద్దెకి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. మహిళా సంఘాలు తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీ అందించనుంది. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలకు భారీ ఆదాయం సమకూరనుంది అంటున్నారు.