ఇన్వెస్టర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జియో, ఓయో, ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్ సహా ఇంకెన్నో.. ఐపీఓల పండగే..

Wait 5 sec.

SBI MF IPO 2026: వచ్చే ఏడాది దేశీయ ప్రైమరీ మార్కెట్ కళకళలాడబోతోంది. చాలా పెద్ద పెద్ద కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా లిస్టింగ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిల్లో అతిపెద్ద కన్జూమర్, టెక్నాలజీ, ఆర్థిక సంస్థలు ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిల్లో , నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి, ఫ్లిప్‌కార్ట్, ఓయో, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఫోన్‌పే, జెప్టో సహా ఇలా ఇంకెన్నో ఉన్నాయని చెప్పొచ్చు. సాధారణంగానే ఐపీఓలు అంటే ఇన్వెస్టర్లను ఇట్టే ఆకర్షిస్తాయి. ఇంకా ప్రముఖ కంపెనీల నుంచి వచ్చే ఐపీఓల కోసం జనం ఎగబడతారని చెప్పొచ్చు. వీటికి డిమాండ్‌కు తగ్గట్లుగానే.. సబ్‌స్క్రిప్షన్ ఎన్నో రెట్లు జరుగుతుంటాయి. దీంతో ఇన్వెస్టర్లు.. వచ్చే ఏడాది కోసం ఎదురుచూస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీల ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఐపీఓల జోష్ కొనసాగుతోంది. 2020-25 మధ్య ఎన్నో కంపెనీలు ఐపీఓల ద్వారా సుమారు రూ. 5.39 లక్షల కోట్ల నిధుల్ని సమీకరించాయి. ఇది 2000-2020 వరకు వచ్చిన వాటి కంటే రెట్టింపు కావడం విశేషం. పబ్లిక్ ఇష్యూ సైజ్ పెరగడం ఇక్కడ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. గత కొన్నేళ్లలో పెద్ద పెద్ద కంపెనీలు.. ఐపీఓలకు వచ్చాయి. దీంతో ఎక్కువ మొత్తంలో నిధుల్ని సమీకరించాయి. గత 4-5 ఏళ్లలో చూస్తే.. హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా క్యాపిటల్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్ఐసీ, ఎస్బీఐ కార్డ్స్, NTPC గ్రీన్ ఎనర్జీ, స్విగ్గీ ఇలా ఎన్నో కంపెనీలు వచ్చాయి. దీనికి మించి వచ్చే ఏడాది ఇంకా పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. 2026లో ప్రముఖ కంపెనీలు సహా అన్నీ కలిపి రికార్డు స్థాయిలో రూ. 1.77 లక్షల కోట్ల మేర నిధుల్ని సమీకరించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ జియో కోసం అంతా ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఈ కంపెనీ విలువనే రూ. 11-12 లక్షల కోట్లుగా అంచనా వేస్తుండగా.. ఇది భారత్‌లోనే అతిపెద్ద ఐపీఓ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. NSE ఐపీఓ కూడా వచ్చే ఏడాది ప్రారంభంలోనే వచ్చే అవకాశం ఉంది. ఇక ఫోన్‌పే ఇప్పటికే రహస్య మార్గంలో సెబీకి ముసాయిదా డాక్యుమెంట్లు పంపినట్లు తెలుస్తోంది. ఇది రూ. 13 వేల కోట్లకుపైగా నిధుల్ని సమీకరించనున్నట్లు భావిస్తున్నారు. సాఫ్ట్ బ్యాంక్ బ్యాక్డ్ ద్వారా రూ. 7 వేల కోట్లకుపైగా సమీకరించాలని చూస్తోంది. సమీకరించనున్నట్లు భావిస్తున్నారు. వీటితో పాటు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ AMC, హీరో ఫిన్‌కార్ప్, నవీ టెక్నాలజీస్, జెప్టో వంటివి కూడా ఐపీఓల ద్వారా వచ్చే ఏడాది ఎంట్రీ ఇచ్చి ఇన్వెస్టర్లను ఆకర్షించనున్నాయి.