ఏడాదికి రూ.20 కడితే రూ.2,00,000 బెనిఫిట్.. SBI కీలక ప్రకటన.. ఖాతాదారులకు మంచి ఛాన్స్!

Wait 5 sec.

SBI: దేశంలోని అతిపెద్ద పీఎస్‌యూ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కీలక సూచన చేసింది. తమ బ్యాంకులో ఖాతా ఉన్న వారు ఏడాదికి కేవలం రూ.20 చెల్లించి ఏకంగా రూ.2 లక్షల బెనిఫిట్ పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్నఈ స్కీమ్ ద్వారా తమ ఖాతాదారులకు బీమా భరోసా కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. మరి ఆ స్కీమ్ ద్వారా రూ.2 లక్షల బెనిఫిట్ ఎలా లభిస్తుంది? అర్హతలు ఏంటి? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్ పోస్ట్ ప్రకారం.. 'అందరికీ ఆర్థిక రక్షణ, మనశ్శాంతిని అందించడానికి రూపొందించిన ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని మీకు అందిస్తున్నాము. సంవత్సరానికి కేవలం రూ.20 తో మీరు మీ కుటుంబ భద్రతను నిర్ధారించుకోవచ్చు, జీవితంలోని అనిశ్చితులను నమ్మకంగా ఎదుర్కోవచ్చు. మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడంలో, చింత లేని రేపటిని చేరుకోవడంలో మాతో చేరండి.' అని పేర్కొంది. భవిష్యత్తును భద్రం చేసుకుని మనశ్శాతింతో జీవిచండం అనే ట్యాగ్ లైన్‌తో ఈ స్కీమ్ గురించిన అర్హతల వంటి వివరాలు వెల్లడించింది. ఇది ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మరణం లేదా శాశ్వత వైకల్యం ఏర్పడినప్పుడు బీమా డబ్బు లభిస్తుంది. కేవలం ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంక్ ఖాతా నుంచి ప్రతి ఏటా ఆటోమేటిక్‌గా రూ.20 బీమా కోసం తీసుకునేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆటో డెబిట్ ద్వారా ప్రతి నెలా జూన్ 1వ తేదీన రూ.20 కట్ చేస్తారు. దీంతో ఏడాది మొత్తం బీమా కవరేజీ లభిస్తుంది. జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు పీఎంజేజేబీవై కవరేజీ లబిస్తుంది. 18 సంవత్సరాల నుంచి 70 ఏళ్ల వయసు వరకు ఈ బీమా తీసుకునేందుకు అర్హులు. బ్యాంక్ ఖాతా మూసివేయడం లేదా అకౌంట్లో సరిపడా బ్యాలెన్స్ లేనప్పుడు బీమా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. రెండు మూడు బ్యాంకు ఖాతాల ద్వారా రూ.20 చొప్పున ప్రీమియం చెల్లించినా రూ.2 లక్షలు మాత్రమే బీమా కవరేజీ ఉంటుంది. ఖాతాదారు మరణించినప్పుడు నామినీకి రూ.2 లక్షలు చెల్లిస్తారు. ఒక కన్ను లేదా రెండు కాళ్లు, రెండు చేతులు వంటివి పూర్తిగా కోల్పోయినప్పుడు సైతం రూ.2 లక్షలు ఇస్తారు. ఒక చేతు లేదా ఒక కాలు, ఒక కన్ను పోయినప్పుడు రూ.1 లక్ష వరకు వస్తాయి. పూర్తి వివరాల కోసం బ్యాంకు అధికారులను సంప్రదించవచ్చు.