గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ఉత్తర్వులు జారీ..

Wait 5 sec.

వినిపించింది. స్పౌస్ గ్రౌండ్స్‌పై అంతర్ జిల్లాల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం జీవో జారీ చేసింది. తాజాగా మార్గదర్శకాల ప్రకారం ఈ బదిలీలు కేవలం రిక్వెస్ట్ బేసిస్ మీద మాత్రమే జరుగుతాయి. అలాగే బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు భార్య లేదా భర్త ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయితేనే ట్రాన్స్‌ఫర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగులు అయితే స్పౌస్ గ్రౌండ్స్ వర్తించదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.మరోవైపు నియామక యూనిట్ అయిన పాత జిల్లాలే ట్రాన్స్‌ఫర్ యూనిట్లుగా ఉంటాయి. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల స్పౌస్ గ్రౌండ్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫర్లకు.. డిసిప్లినరీ కేసులు ఉన్నవారికి అవకాశం లేదు. అలాగే ఏసీబీ లేదా విజిలెన్స్ కేసులు ఉన్నవారి అభ్యర్థనలను కూడా పరిగణనలోకి తీసుకోరు. స్థానిక MPDO లేదా మున్సిపల్ కమిషనర్ నుంచి నోడ్యూస్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఈ ట్రాన్స్‌ఫర్ల కోసం వివాహ ధ్రువీకరణ పత్రం, స్పౌస్ ఉద్యోగ ధ్రువీకరణ పత్రం, ఎంప్లాయి ఐడీ వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. అలాగే ఖాళీలు ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్‌ఫర్‌కు అనుమతి ఇస్తారు. బదిలీల ప్రక్రియను నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మరోవైపు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ కోసం పలు నిబంధనలు ఉన్నాయి. ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. అలాగే ట్రాన్స్‌ఫర్ అయిన ఉద్యోగికి ఆ జిల్లాలో చివరి ర్యాంక్ కేటాయిస్తారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సీరియల్‌గా అమర్చుతారు. టై ఉంటే సర్వీస్ సీనియారిటీతో పాటుగా పుట్టినరోజును ప్రామాణికంగా తీసుకుంటారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పిస్తే.. ఎంపీడీవో సర్టిఫై చేస్తారు. తాత్కాళిక సీనియారిటీ జాబితాను పోర్టల్‌లో ఉంచుతారు. అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్ ద్వారా అప్ లోడ్ చేయొచ్చు. వీటిని పరిశీలించిన అనంతరం హెచ్ఓడీలు సీనియారిటీ తుది జాబితాను పోర్టల్‌లో ఉంచుతారు.