విశాఖపట్నం జిల్లాలో త్రుటిలో రైలు ప్రమాదం తప్పింది. పెందుర్తి వద్ద టాటానగర్ ఎక్స్ ప్రెస్ తప్పింది. పెందుర్తి వద్ద రైల్వే పనులు జరుగుతున్నాయి. అయితే బుధవారం ఓ కరెంట్ స్తంభం ఒరిగి.. పక్కనే ఉన్న ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ తీగలపై పడింది. ఈ ప్రమాదంలో అక్కడ డ్యూటీలో ఉన్న ఇద్దరు ఉద్యోగులు, మరో వ్యక్తి గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అటుగా టాటానగర్ ఎక్స్ ప్రెస్ రైలు వచ్చింది. ప్రమాదంలో ఉద్యోగులు గాయపడి ఉండటం, విద్యుత్ స్తంభం ఒరిగి ఉండటం, అలాగే విద్యుత్ తీగలు నేలపై పడి ఉండటం రైలులోని లోకో పైలట్ గుర్తించాడు. వెంటనే అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించి టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆపివేశాడు. దీంతో తప్పింది. ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.మరోవైపు లోకోపైలట్ వెంటనే అలర్ట్ కాకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగేదని రైలు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రైల్వే సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన ముగ్గురిలో ఓ వ్యక్తి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. పెందుర్తి రహదారిపై ప్రమాదంమరోవైపు ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం రోడ్డుపై ఆగిఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో కూరగాయలు అమ్మే ఓ మహిళ చనిపోయింది. ఆనందపురం మండలం ముచ్చర్లకు చెందిన లక్ష్మి అనే మహిళకూరగాయలు అమ్ముతూ జీవిస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం ఉదయమే ఆనందపురం మార్కెట్‌లో లక్ష్మి కూరగాయలు కొనుగోలు చేశారు. అనంతరం తమ ఊరికి చెందిన అప్పలరాజు ఆటోలో ఊరికి బయల్దేరారు. అయితే ఆటోలో ఆనందపురం-పెందుర్తి జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఉన్న లారీని ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటో డ్రైవర్ అప్పలరాజు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ప్రమాదం గురించి స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని.. విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించారు.