5 అదానీ కంపెనీల్లో బ్లాక్ డీల్స్.. చేతులు మారిన కోట్లాది షేర్లు.. విలువ రూ. 5 వేల కోట్లకుపైనే!

Wait 5 sec.

GQG Partners Adani Group: భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం సెషన్‌లో ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ వార్త రాసే సమయంలో ఉదయం 10 గంటలకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా పెరగ్గా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 20 పాయింట్ల లాభంలో ఉంది. అయితే.. ఇక్కడ దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి చెందిన స్టాక్స్ ఒక్కసారిగా ఫోకస్‌లోకి వచ్చాయి. దీనికి కారణం.. దిగ్గజ పెట్టుబడిదారు రాజీవ్ జైన్‌కు చెందినటువంటి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ జీక్యూజీ పార్ట్‌నర్స్.. అదానీ గ్రూప్ కంపెనీల్లో వాటాను పెంచుకుంది. సుమారు 5 కంపెనీల్లో.. చేసిందని తెలిసింది. ఇందులో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్ ఉన్నాయి. ఈ క్రమంలో మొత్తం అన్ని కంపెనీల్లో బ్లాక్ డీల్స్ ద్వారా సుమారు రూ. 5,094 కోట్ల విలువైన షేర్లను GQG పార్ట్‌నర్స్ దక్కించుకోవడం గమనార్హం. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 53.42 లక్షల విలువైన షేర్లను.. జీక్యూజీ పార్ట్‌నర్స్ ఇంటర్నేషనల్ ఈక్విటీ CIT.. 3 బ్లాక్స్ ద్వారా కొనుగోలు చేసింది జీక్యూజీ పార్ట్‌నర్స్. ఇక్కడ ఒక్కో షేరును రూ. 2,462 చొప్పున మొత్తం రూ. 1315.20 కోట్లకు సొంతం చేసుకుంది. బుధవారం సెషన్‌లో ఈ స్టాక్ ధర ప్రస్తుతం రూ. 2,440 స్థాయిలో ఉంది. ఇక్కడ షేర్లను విక్రయించింది రిలయన్స్ ట్రస్ట్ ఇన్‌స్టిట్యూషనల్ రిటైర్మెంట్ ట్రస్ట్ సిరీస్ ఎలెవెన్. 2025, సెప్టెంబర్ 30 నాటికి మొత్తం జీక్యూజీకి.. ఈ అదానీ కంపెనీలో 1.75 శాతం వాటాకు సమానమైన 2.01 కోట్ల షేర్లు ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌లో 73.17 లక్షల షేర్లను ఒక్కో షేరుకు రూ. 1507.6 చొప్పున కొనుగోలు చేసింది జీక్యూజీ. ఇక్కడ కూడా రిలయన్స్ ట్రస్ట్ షేర్లను విక్రయించగా.. ఈ డీల్ విలువ రూ. 1103.14 కోట్లుగా ఉంది. ఈ కంపెనీలో మొత్తంగా 2.42 శాతం వాటాకు సమానమైన 5.21 కోట్ల షేర్లు ఉన్నాయి. జీక్యూజీ పార్ట్‌నర్స్.. అదానీ గ్రీన్ ఎనర్జీలో 77.39 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. ఇక్కడ ఒక్కో షేరును రూ. 1088.6 దగ్గర కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 842.53 కోట్లు కాగా.. ఇక్కడ కూడా రిలయన్స్ ట్రస్ట్ సెల్లర్‌గా ఉంది. ఈ కంపెనీలో చూస్తే మొత్తం 2.46 శాతం వాటాకు సమానమైన 4.04 కోట్ల షేర్లు ఉన్నాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌లో 53.94 లక్షల షేర్లను ఒక్కో షేరుకు రూ. 1021.55 చొప్పున కొనుగోలు చేయగా.. ఈ డీల్ మొత్తం విలువ రూ. 551.08 కోట్లు. ఈ కంపెనీలో మొత్తం వాటా 1.86 శాతంగా ఉండగా.. షేర్ల సంఖ్య 2.23 కోట్లు ఉన్నాయి. జీక్యూజీ పార్ట్‌నర్స్.. అదానీ పవర్ కంపెనీలో 83.61 లక్షల షేర్లను 3 ట్రాంచీల్లో ఒక్కో షేరును రూ. 153.28 దగ్గర కొనుగోలు చేసింది. ఈ డీల్ సైజ్ రూ. 1281.57 కోట్లుగా ఉంది. ఇక్కడ కూడా రిలయన్స్ ట్రస్ట్ విక్రయదారుగా ఉంది. ఈ కంపెనీలో మొత్తం 1.54 శాతం వాటాకు సమానమైన 29.23 కోట్ల షేర్లు ఉన్నాయి. గతంలో విపరీతంగా పడిపోయినప్పటికీ.. జీక్యూజీ పార్ట్‌నర్స్ విస్తృతంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ స్టాక్స్ పుంజుకున్నాయి. ఇతర కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.