5 ఏళ్లకే లక్షకు రూ.51 లక్షలు.. ఇప్పుడు 1 షేరుకు 5 షేర్లు ఇస్తోన్న కంపెనీ.. రికార్డ్ తేదీ ఇదే

Wait 5 sec.

Stock Split: స్మాల్ క్యాప్ కేటగిరిలోని చెందిన జెమ్స్ అండ్ జ్యూవెలరీ సర్వీసెస్ సెక్టార్ కంపెనీ మినీ డైమండ్స్ ఇండియా లిమిటెడ్ () తమ వాటాదారులకు శుభవార్త చెప్పింది. ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై చేయడానికి ఆమోదం తెలుపినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక తాజాగా ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ డిసెంబర్ 2గా నిర్ణయించినట్లు కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది. మరోవైపు ఈ కంపెనీ షేరు గత 5 ఏళ్ల కాలంలో ఏకంగా 5187 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. నవంబర్ 13వ తేదీన జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో కంపెనీల చట్టం 2013 లోని సెక్షన్ 61 కి అనుగుణంగా 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయడానికి ఆమోదం లభించింది. దీని అర్థం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉండేలా 5 ఈక్విటీ షేర్లుగా విభజిస్తారు. అయితే తాజాగా ఈ స్టాక్ స్ప్లిట్‌కి అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు తేదీని డిసెంబర్ 2, 2025గా డైరెక్టర్స్ బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. స్టాక్ అవుట్ లుక్ పరిశీలిస్తే శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ సెషన్లో మినీ డైమాండ్స్ ఇండియా షేరు సుమారు 1.30 శాతం నష్టంతో రూ. 140.10 వద్ద స్థిరపడింది. గత వారం రోజుల్లో ఈ షేరు 3 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో ఈ షేరు 3 శాతం తగ్గింది. గత ఆరు నెలల్లో 27 శాతం పడిపోయింది. గత ఏడాది కాలంలో 30 శాతం తగ్గింది. అయితే గత ఐదు సంవత్సరాల్లో 5187 శాతం లాభాన్ ఇచ్చింది. ఏడాది క్రితం రూ. 1 లక్ష పెట్టి షేర్లు కొనుగోలు చేసి ఇప్పటి వరకు కొనసాగి ఉంటే ఆ విలువ రూ. 51.87 లక్షలు అవుతుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 330 కోట్ల వద్ద ఉంది.