ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రతిపాదనకు ఢిల్లీ క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ జిల్లాల పెంపు ఫైల్ తుది ఆమోదం కోసం వద్దకు వెళ్లింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే.. ఢిల్లీలో కొత్త జిల్లాల వ్యవస్థ అమల్లోకి రానుంది.ఈ రెవెన్యూ జిల్లాల సంఖ్య 13కు చేరనుంది. అలాగే సబ్ డివిజన్ కార్యాలయాల సంఖ్య 33 నుంచి 39కి పెంచనున్నారు. ఢిల్లీ ప్రజలు చిన్న చిన్న పనుల కోసం.. రెవెన్యూ సంబంధిత సేవల కోసం దూర ప్రాంతాల్లోని ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా చేయడమే ఈ జిల్లాల పెంపు ముఖ్య ఉద్దేశమని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.మినీ సచివాలయాలుకొత్తగా ఏర్పడే ప్రతి జిల్లాలోనూ ఒక మినీ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయాలని రేఖా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది. శాంతి భద్రతలు (పోలీస్) మినహా.. మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల సేవలు ఒకే గొడుగు కింద ఢిల్లీ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో రద్దీ తగ్గడంతో పాటు.. ఫైళ్ల కదలిక వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.మ్యాప్ ఎలా మారుతుంది?ఢిల్లీలోని 11 మున్సిపల్ జోన్ల సరిహద్దుల ఆధారంగా కొత్త జిల్లాలను రూపొందిస్తున్నారు. ముసాయిదా ప్రణాళిక ప్రకారం.. సదర్ జోన్ పేరును ఓల్డ్ ఢిల్లీ జిల్లాగా మారుస్తారు. ప్రస్తుతం ఉన్న తూర్పు, ఈశాన్య జిల్లాలను రద్దు చేసి.. వాటి స్థానంలో షహద్రా నార్త్, షహద్రా సౌత్ జిల్లాలను ఏర్పాటు చేస్తారు. నైరుతి జిల్లాలోని ఒక పెద్ద భాగాన్ని విడదీసి కొత్తగా నజఫ్‌గఢ్ జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. నార్త్ జిల్లాను విభజించి సివిల్ లైన్స్, ఓల్డ్ ఢిల్లీ పరిధిలోకి తీసుకురానున్నారు.ఢిల్లీలో ప్రతిపాదిత కొత్త జిల్లాలు ఇవే1. ఓల్డ్ ఢిల్లీ (సదర్ బజార్, చాందినీ చౌక్)2. సెంట్రల్ ఢిల్లీ (డిఫెన్స్ కాలనీ, కల్కాజీ)3. న్యూఢిల్లీ (న్యూఢిల్లీ, ఢిల్లీ కంటోన్మెంట్)4. సివిల్ లైన్స్ (అలీపూర్, ఆదర్శ్ నగర్)5. కరోల్ బాగ్ (మోతీ నగర్, కరోల్ బాగ్)6. కేశవ్ పురం (షాలిమార్ బాగ్, మోడల్ టౌన్)7. నరేలా (నరేలా, ముండ్కా)8. నజఫ్‌గఢ్ (ద్వారకా, నజఫ్‌గఢ్, వసంత్ విహార్)9. రోహిణి (రోహిణి, మంగోల్ పురి)10. షహద్రా సౌత్ (గాంధీ నగర్, కొండ్లి)11. షహద్రా నార్త్ (సీలంపూర్, షహద్రా)12. సౌత్ డిస్ట్రిక్ట్ (మెహ్రౌలీ, ఆర్కే పురం)13. వెస్ట్ డిస్ట్రిక్ట్ (జనక్‌పురి, వికాస్‌పురి)కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని చేసిన ప్రతిపాదనలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే రేఖా శర్మ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి ఈ కొత్త జిల్లాలను ప్రజలకు అందుబాటులోకి తేనుంది.