రైతులకు గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్లలో డబ్బులు జమ.. మీ పేరుందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు!

Wait 5 sec.

: చాలా కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కానున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ.. స్వయంగా ఈ డబ్బులు విడుదల చేయనున్నారు. అర్హులైన రైతుల బ్యాంక్ అకౌంట్లలోనే నేరుగా ఈ డబ్బులు పడతాయని చెప్పొచ్చు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ అలాగే పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా కేంద్రం పేర్కొంది. 21వ విడతలో భాగంగా.. అర్హులైన లబ్ధిదారులకు (రైతులకు) ఒక్కొక్కరికి రూ. 2 వేల చొప్పున పడనున్నాయని చెప్పొచ్చు. మొత్తం 9 కోట్ల మందికిపైగా రైతులకు.. రూ. 18 వేల కోట్లకుపైగా డబ్బులు రానున్నాయి.ఈ క్రమంలోనే మరో విడత డబ్బులు రానున్న నేపథ్యంలో లబ్ధిదారులకు.. కేంద్రం కీలక సూచనలు చేసింది. కింద నమోదు చేసుకున్న రైతులు అంతా కచ్చితంగా ఇ- కేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసింది. డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి అని వెల్లడించింది. కేవైసీని 3 విధానాల్లో చేసుకోవచ్చని స్పష్టం చేసింది. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఓటీపీ బేస్డ్ ఇ- కేవైసీ చేసుకోవచ్చని తెలిపింది. సమీప కామన్ సర్వీస్ కేంద్రాల్లో బయోమెట్రిక్ ఇ- కేవైసీ పూర్తి చేయొచ్చు. ఇంకా పీఎం కిసాన్ అఫీషియల్ యాప్‌ ద్వారా ఫేస్ అథెంటికేషన్‌తో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ముందుగానే చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీ అకౌంట్లలో డబ్బులు పడతాయో లేదో అనేది తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఉంటుంది. హోం పేజీలో ఫార్మర్స్ కార్నర్‌ను క్లిక్ చేయాలి. అక్కడ బెనిఫిషియరీ లిస్ట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, విలేజ్ పేర్లు ఎంటర్ చేసి.. గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ లబ్ధిదారుల జాబితాను మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో పేరు ఉంటే.. మీ అకౌంట్లో రూ. 2 వేలు పడతాయన్నమాట. కొందరిని పీఎం కిసాన్ పథకం కింద అనర్హులుగా ప్రకటించింది కేంద్రం. 2019, ఫిబ్రవరి 1 తర్వాత భూ యాజమాన్య హక్కులు వస్తే.. వారికి డబ్బులు రావు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటే (భార్యాభర్తలు, తండ్రికుమారులు ఇలా) అనర్హులే. ఇలాంటి అనుమానాస్పద కేసుల్లో పూర్తి వెరిఫికేషన్ పూర్తయ్యేవరకు తాత్కాలికంగా డబ్బులు నిలిపివేస్తారు. పీఎం కిసాన్ పథకం విషయానికి వస్తే.. రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం ఉద్దేశించిన కేంద్రం పథకం. ఇక్కడ అర్హులైన రైతులకు ఏటా రూ. 6 వేల చొప్పున వస్తాయి. దీనిని ఒకేసారి కాకుండా 3 విడతల్లో రూ. 2 వేల చొప్పున జమ చేస్తుంది. ఇప్పటివరకు 20 విడతల్లో డబ్బులు పడ్డాయి.