ఏపీలో ఉపాధి హమీ కూలీలకు షాక్.. జాబ్ కార్డులు రద్దు చేశారు, ఇకపై డబ్బులు కూడా ఇవ్వరు

Wait 5 sec.

దేశవ్యాప్తంగా కేంద్రం ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ-కేవైసీని తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి చర్యలతో ఉపాధి హామీ పథకంలో బోగస్ జాబ్ కార్డుల వ్యవహారం బయటపడుతోంది. ప్రతి శ్రామికుడికి ఈ-కేవైసీ తప్పనిసరి చేయడం వల్ల బోగస్ కార్డుల వ్యవహారం బయటపడింది. ఏపీలో భారీగా బోగస్ కార్డులు బయటపడ్డాయి. ఏపీలోని మొత్తం 26 జిల్లాల్లో 7.44 లక్షల బోగస్ కార్డులను గుర్తించి తొలగించారు. కాకినాడ జిల్లాలో 72,872 బోగస్ జాబ్ కార్డులను తొలగించారు. అన్నమయ్యలో 67,446, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులో 53,444, ప్రకాశం జిల్లాలో 50,868 కార్డులను కూడా రద్దు చేశారు. ఏపీలో మొత్తం 1.10 కోట్ల మందిలో 87.10 లక్షల మంది ఇప్పటికే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు. మరో 18.52 లక్షల మంది లెక్క తేలాల్సి ఉంది. అయితే ఇవన్నీ బోగస్ జాబ్ కార్డులుగా అనుమానిస్తున్నారు అధికారులు. ఈ బోగస్ కార్డుల ద్వారా, పనులు చేయకపోయినా డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో 5 లక్షల మంది ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో బోగస్ జాబ్ కార్డులకు దొంగ మస్తర్లు వేసి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ-కేవైసీ ప్రక్రియ వల్ల ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతోంది. వాస్తవానికి ఉపాధి హామీ పథకంతో గ్రామాల్లో పేదలకు ఉపాధి కల్పిస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఉపాధి హామీ పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ బోగస్ జాబ్‌కార్డులతో అక్రమాలకు పాల్పడ్డారు.ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై జాబ్ కార్డు ఉన్నవారు తప్ప, వారి బదులు వేరేవారు హాజరైనట్లు చూపించి డబ్బులు దండుకునే పద్ధతికి చెక్ పడనుంది. శ్రామికుల ఈ-కేవైసీ (e-KYC) తీసుకోని, వారి ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. ఈ కొత్త విధానం వల్ల ఒకరి బదులు మరొకరు హాజరైతే యాప్ (App) అనుమతించదు. అక్టోబర్ 1 నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాలను ఎంపిక చేసి ఈ ప్రయోగాన్ని మొదలుపెడతారు. జాబ్ కార్డులు ఉన్న చాలామంది ఉపాధి పనులకు వెళ్లడం లేదు. వారి స్థానంలో వేరేవాళ్లు వెళ్లి హాజరు వేసుకుంటున్నారు. అయితే వేతనాలు మాత్రం జాబ్ కార్డు ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లోకే జమ అవుతున్నాయి. జాబ్ కార్డుదారుల ఈ-కేవైసీ (e-KYC) తీసుకొని, వారి ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. దీనివల్ల, జాబ్ కార్డుదారుడు కాకుండా వేరే వ్యక్తి హాజరైతే, యాప్ (App) దాన్ని గుర్తించి, అనుమతించదు.