రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ఇక భాగ్యనగరంలో చలి ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది. పెద్దగా ఎండ తగిలేందుకు అవకాశం లేకపోవడంతో నగర వాసులు చలికి వణికిపోతున్నారు. ఇండ్లలో ఉండే వారి పరిస్థితే ఇలా ఉంటే.. పాపం రోడ్ల మీద, బస్ స్టాపుల్లో తలదాచుకునే వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా మానవత్వంతో వారికి దుప్పట్లు పంచితే కాస్త ఉపశమనం. కానీ సమస్య పూర్తిగా తీరదు. ఇలాంటి వారి కోసం . నిరాశ్రయులను ఆదుకోవడం కోసం షెల్టర్ హోమ్స్‌ను తీసుకురానుంది. వీటిల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉచితంగా అందించడమే కాక ఫ్రీగా వసతి కూడా కల్పిస్తారు. నగరంలో 10 సెంటరల్లో ఈ షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. వాటి వివరాలు.. నగరంలో ఉండడానికి చోటులేక బస్టాపులు, రోడ్లు, ఫుట్ పాత్‌లు వంటి ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వారికి అండగా నిలుస్తున్నాయి. బల్దియా సిబ్బంది నిరాశ్రయులను గుర్తించి.. వారిని షెల్టర్ హోమ్స్‌కు తీసుకువెళ్తున్నారు. వీరికే కాక.. పనుల నిమిత్తం జిల్లాల నుంచి సిటీకి వచ్చి కొద్ది రోజులు ఉండే వారికి కూడా ఈ హోమ్స్ లో ఉండేందుకు అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. మానసిక సమస్యలతో బాధపడుతూ రోడ్ల మీద తిరిగే వారి కోసం ప్రత్యేక షెల్టర్ హోం నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం ఆధ్యర్యంలో మొత్తం 10 షెల్టర్ హోమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 269 మంది వరకు ఉండేందుకు అవకాశం ఉంది. మొత్తం 10 షెల్టర్ హోమ్స్‌లలో గోల్నాక, ఉప్పల్, సరూర్ నగర్ ప్రాంతాల్లో ఉన్న హోమ్స్‌ని కేవలం మహిళల కోసం కేటాయించారు. మిగతావి పురుషుల కోసం ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఇందులో 164 మంది మాత్రమే ఉంటున్నారు. అలానే బేగంపేటలో ఉన్న షెల్టర్ హోమ్‌ని రికవరీ సెంటర్‌గా మార్చారు. మానసికంగా బాగా లేని వారితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఆస్పత్రుల్లో వైద్యం చేయించి.. ఇక్కడ అబ్జర్వేషన్‌లో ఉంచుతారు. వీరు కోలుకున్న తర్వాత ఇతర సెంటర్లకు లేదా కుటుంబసభ్యులను గుర్తిస్తే వారి వద్దకు పంపిస్తారు. ప్రస్తుతం ఈ సెంటర్‌లో 40 మందికి అవకాశం ఉండగా.. కేవలం 25 మంది మాత్రమే ఉంటున్నారు. నగరంలో ఉన్న 10 సెంటర్లలో 8 షెల్టర్ హోమ్‌లు ఎన్జీవోల సహకారంతో నడుస్తున్నాయి. వీటి కోసం జీహెచ్ఎంసీతో ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా షెల్టర్ హోమ్స్‌లో ఉంటున్నవారికి టిఫిన్, లంచ్, డిన్నర్ అందిస్తారు. ఒక్కే కేంద్రంలో మేనేజర్ తో పాటు ముగ్గురు ఇతర సిబ్బంది కూడా ఉంటారు. ఈ షెల్టర్ హోమ్స్ నిర్వహణ కోసం.. .. ఒక్కో సెంటర్‌కి రూ.23,333 ఖర్చు చేస్తుంది. జీహెచ్ఎంసీకి చెందిన వాటిల్లోనే షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేశారు. వీటిల్లో ఆరు నెలల వరకు ఉండేందుకు అవకాశం కల్పిస్తున్నారు. నగరంలో షెల్టర్ హోమ్స్ ఉన్న ప్రాంతం.. వాటికి కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నంబర్లు వంటి వివరాలు..పేట్లబురుజు వార్డు ఆఫీసు, చార్మినార్ ఏపీ మహిళా వెల్ఫేర్ సొసైటీ 9885096035శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీ గ్రేస్ ఎన్జీవో 9848076471ఉప్పల్ కమ్యూనిటీ హాల్ అమన్ వేదిక 9966831014కమలానగర్ కమ్యూనిటీ హాల్, గోల్నాక సయోధ్య 9346801646అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్, టప్పాచబుత్రా ఎల్ఎస్ఎన్ ఫౌండేషన్ 7989654635వార్డు ఆఫీసు, యూసుఫ్ గూడ ఆశ్రే హోం ఫర్ ఏజ్డ్ 9000495026బేగంపేట్ ఫ్లైఓవర్, కంట్రీక్లబ్ వద్ద శ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ 9985704234బేగంపేట ఫ్లైఓవర్, బ్రాహ్మణివాడ అమన్ వేదిక 9966831014బేగంపేట ఫ్లైఓవర్(రికవరీ), బ్రాహ్మణివాడ అమన్ వేదిక 9966831014ఓల్డ్ మున్సిపల్ ఆఫీసు, శేరిలింగంపల్లి ఆశ్రే హోం ఫర్ ఏజ్డ్ 9000495026