: మన దేశంలో ఆదాయపు పన్ను వ్యవస్థ అమల్లో ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో.. నిర్దిష్ట ఆదాయానికి మించి ఆర్జించినట్లయితే.. అప్పుడు పన్ను చట్టం ప్రకారం.. పన్ను శ్లాబుల ఆధారంగా టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ మొత్తం ఆదాయం వివరాల్ని వెల్లడించాలి. పాత పన్ను విధానంలో కొన్ని మినహాయింపులకు అవకాశం ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్, డొనేషన్స్, ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ, పీపీఎఫ్ వంటి పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడులు, ఆరోగ్య బీమా ఇలాంటి వాటిపై మినహాయింపుల్ని పొందొచ్చు. అప్పుడు ఆదాయపు పన్ను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఇదే అదునుగా కొందరు పన్ను చెల్లింపుదారుల్ని తప్పుడు విధానాల్ని అవలంబిస్తున్నారు. తప్పుడు క్లెయిమ్స్ చేస్తూ.. మినహాయింపుల్ని పొందడం లేదా వచ్చింది. ఇప్పుడు అలా చేస్తే ఏ మాత్రం సహించట్లేదు. గట్టి నిఘాతో.. వారిని గుర్తించి చర్యలు తీసుకుంటోంది. తప్పుడు మినహాయింపులు అంటే.. లేని అద్దె రసీదులు, రాజకీయ విరాళాలు సహా చెల్లించని విద్యా రుణం వడ్డీ, తప్పుడు HRA వంటివి క్లెయిమ్ చేయడం ద్వారా ఐటీ వ్యవస్థనే మోసం చేసేందుకు ప్రయత్నించడం. అయితే.. ఇలా బయటపడ్డాం అనుకుంటే పొరపాటే.. ఇక్కడ దొరికితే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో కొందరు తప్పించుకున్నప్పటికీ.. ఇటీవల పరిస్థితి మారిపోయింది. ఐటీ శాఖ. పకడ్బందీ విధానాల్ని పాటిస్తూ.. అలాంటి వారిని పట్టుకుంటోంది. ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు అత్యాధునిక డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ ఆధారంగా.. ఐటీఆర్‌లను ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ వేతన జీవులు క్లెయిమ్ చేసిన రిఫండ్స్/మినహాయింపుల్ని.. యజమానులు రిపోర్ట్ చేసిన TDS (ఫాం 16/16A) డేటాతో సరిపోలుస్తుంది. ఇక్కడ యజమాని ఇచ్చిన టీడీఎస్‌ డేటాలో లేనటువంటి మినహాయింపుల్ని గుర్తించి.. తప్పుడు . ఇలాంటి టాక్స్ పేయర్లు ఎలాంటి చర్యలు ఎదుర్కొంటారో ఇప్పుడు చూద్దాం. >> సెక్షన్ 131 (A) కింద సమన్లు జారీ చేసి.. వారు క్లెయిమ్ చేసిన ఎడ్యుకేషన్ లోన్ లేదా డొనేషన్స్ రుజువుల్ని చూపాలని అడగొచ్చు. సెక్షన్ 143 (2) కింద అద్దె భత్యం బకాయిలు అలాగే సెక్షన్ 142 (1) కింద సెక్షన్ 80C, సెక్షన్ 80EEA కింద ప్రూఫ్స్ అడగొచ్చు. సెక్షన్ 148A కింద అసెస్‌మెంట్ రీఓపెనింగ్ నోటీసులు అందొచ్చు. ఇలా చాలానే కేసులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. అసెస్మెంట్ పూర్తయిన తర్వాత.. తప్పుడు క్లెయిమ్స్ రుజువైతే ఆదాయాన్ని తప్పుగా నివేదించినందుకు.. సెక్షన్ 270A కింద చెల్లించాల్సినటువంటి పన్నుపై 200 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇంకా సెక్షన్ 276C (1) కింద ఆదాయం తక్కువగా చూపినందుకు.. సెక్షన్ 277 కింద తప్పుడు ధ్రువీకరణ పన్ను చెల్లింపుదారులు క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోవచ్చు. ఇక్కడ నేరం రుజువైతే.. కనీసం 3 నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడుతుంది. ఇదే సమయంలో పన్ను చెల్లింపుదారులు.. తమ తప్పుల్ని తెలుసుకొని.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ముందు చట్టబద్ధంగా వాటిని సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఉంటుంది. 2025, డిసెంబర్ 31 వరకు రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. తప్పుడు క్లెయిమ్స్ ఉపసంహరించుకోవాలి. చెల్లించాల్సిన పన్నుపై వడ్డీతో చెల్లించాలి. అప్పుడు పెనాల్టీ, జైలు శిక్ష తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరాల్లోనూ ఇలాగే ఏమైనా తప్పుడు క్లెయిమ్స్ చేస్తే.. అప్డేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా శిక్ష తగ్గించుకోవచ్చ.