చెప్పింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు పడే తిప్పలకు ఉపశమనం కలిగించింది. ఈ మేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ.. రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని అందుకోసం ప్రత్యేకంగా 73373-59375 నెంబర్‌ను కేటాయించామన్నారు. ధాన్యం అమ్మాలనుకుంటున్న రైతులు ఈ నెంబర్‌కు.. వాట్సాప్‌లో Hi అని సందేశం పంపగానే.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్‌తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని పేర్కొన్నారు.వాట్సాప్‌ సేవలను ఇలా ఉపయోగించుకోవాలి..ఈ వాట్సాప్ సేలవను ఎలా వినియోగించుకోవాలో నాదెండ్ల మనోహర్ వివరించారు. "రైతులు మొదట తమ ఆధార్ నెంబర్ నమోదు చేసేకోవాలి. అనంతరం రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుంది. తర్వాత ధాన్యం అమ్మదలచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాలి. ఏ రోజు అమ్మాలనుకుంటున్నారో.. ఆ తేదీకి సంబంధించి మూడు ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాలి. అనంతరం సమయాన్ని కూడా ఎంచుకోవాలి. తర్వాత ఎలాంటి రకం ధాన్యం, ఎన్ని బస్తాల రూపంలో అమ్ముతున్నారు అన్నది అక్కడ నమోదు చేయాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన ఓ కూపన్ కోడ్ వస్తుంది. దీంతో రైతులు సులభంగా తమ ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి.. సులభంగా ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకోవచ్చు" అని మంత్రి తెలిపారు. రైతులకు ఆ తిప్పలు ఉండవు..స్లాట్ బుక్ చేసుకునేందుకు అందరికీ అర్థమయ్యేలా వాట్సప్ ఆప్షన్లు ఇచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇకపై ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలు తరబడి రైతులు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యాన్ని ఎప్పుడు కొంటారు అని కొనుగోలు కేంద్రాల వద్ద బతిమిలాడుకోవడం వంటి విషయాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ అనే సరికొత్త విధానంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి చెప్పారు. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని.. వారి ఇబ్బందులను గ్రహించి సాంకేతికతతో ధాన్యం కొనుగోలు సులభతరం చేశామన్నారు. ఈ వాట్సాప్ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. కాగా, పత్తి కొనుగోళ్ల కోసంప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.