: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీనినే సింపుల్‌గా అంటారు. ఇక్కడ సాగు భూమి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా రూ. 6 వేల చొప్పున అందిస్తుంది. దీనిని ఒకేసారి కాకుండా.. 3 విడతల్లో రూ. 2 వేల చొప్పున నేరుగా అకౌంట్లలోనే జమ చేస్తుంది కేంద్రం. ఇప్పటివరకు 20 విడతల్లో డబ్బులు పడ్డాయి. ఇవాళ నవంబర్ 19న తమిళనాడులోని కోయంబత్తూర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ.. 21వ విడత నిధుల్ని విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే పీఎం కిసాన్ పథకం 20వ విడతలో భాగంగా.. 9.7 కోట్ల మందికిపైగా లబ్ధిదారులు ఉన్నారు. ఆగస్ట్ 2న వీరి ఖాతాల్లో రూ. 20,500 కోట్లు జమయ్యాయి. అయితే ఈసారి మాత్రం 21వ విడత కింద ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య 9 కోట్లుగానే ఉందని తెలుస్తోంది. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌లో కూడా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు జమ అవుతాయని పేర్కొంది. అంటే సుమారు 70 లక్షల మందికిపైగా తగ్గారని సమాచారం. ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య తగ్గేందుకు ప్రధాన కారణం అనర్హులైన రైతుల్ని (లబ్ధిదారుల్ని) గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలేనని తెలుస్తోంది. అంతకుముందు 2024-25 డిసెంబర్- మార్చి సమయంలో లబ్ధిదారుల సంఖ్య 10.68 కోట్లుగా ఉండగా.. ఇది ఇటీవల 9.7 కోట్లకు తగ్గింది. ఇప్పుడు 9 కోట్లకు తగ్గినట్లు సమాచారం. ఇక్కడ అనర్హులని అనుమానించి తేల్చిన లక్షలాది మంది రైతుల ఖాతాల్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. కేవలం అర్హులైన వారికి మాత్రమే ప్రయోజనం దక్కేలా కఠిన చర్యలు తీసుకుంటోంది. వీరికి పీఎం కిసాన్ ప్రయోజనాలు వర్తించవు..పన్ను చెల్లించే రైతులుప్రభుత్వ ఉద్యోగులుఎన్నికైన ప్రజాప్రతినిధులురూ. 10 వేలు లేదా అంతకంటే ఎక్కువగా నెలవారీ పెన్షన్ పొందుతున్నవారురాజ్యాంగ పదవుల్లో ఉన్న వారెవరైనా (ప్రస్తుత, మాజీ)మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, ప్రస్తుత, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఛైర్ పర్సన్స్కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులుస్థానిక సంస్థల్లో పనిచేస్తున్న అలాగే మాజీ ఉద్యోగులుడాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్ వంటి నిపుణులు (ఆయా సంస్థల్లో నమోదు చేసుకొని.. ఈ వృత్తుల్ని కొనసాగిస్తున్న వారు)ఇలా వీరంతా పీఎం కిసాన్ డబ్బులు పొందేందుకు అనర్హులుగా కేంద్రం తేల్చింది. కానీ.. వీరు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉన్నట్లయితే ఇప్పుడు వారి పేర్లు తొలగిస్తుందని చెప్పొచ్చు.ఇంకా 2019, ఫిబ్రవరి తర్వాత భూయాజమాన్య హక్కులు కలిగిన వారు సహా.. ఒకే కుటుంబంలో ఇద్దరు (భార్యాభర్తలు, తండ్రీకొడుకులు) ఇలా ప్రయోజనాలు పొందేందుకు వీల్లేదు. వీరెవరైనా ఉన్నా పేర్లను తొలగిస్తుంది. తాత్కాలికంగా నిధులు నిలిపివేసి.. భౌతిక ధ్రువీకరణ ద్వారా అర్హులా కాదా అనేది తేలుస్తుంది.మరోవైపు.. కేంద్రం 21వ విడత నిధుల్ని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్ లబ్ధిదారులకు ఇప్పటికే జమ చేసింది. వరదల నేపథ్యంలో కాస్త ముందుగానే డబ్బులు వేసింది. వారి పేర్లను ఇప్పుడు లిస్టులో తీసేసినట్లు సమాచారం. ఈ 4 రాష్ట్రాల్లో కలిపి లబ్ధిదారుల సంఖ్య సుమారు 40 లక్షలుగా ఉన్నా.. ఇంకా లక్షల్లో రైతుల పేర్లు తొలగించినట్లేనని తెలుస్తోంది. ప్రస్తుతం పీఎం కిసాన్ 21 వ విడత కింద మీ పేరు ఉందో లేదో అని.. ద్వారా తెలుసుకునేందుకు వీలుంటుంది. ఇక్కడ .. రాష్ట్రం, జిల్లా, బ్లాక్,గ్రామం వివరాలు ఎంటర్ చేసి.. గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేస్తే.. లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.ఇంకా పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకునేందుకు వీలుంటుంది. ఇందుకోసం క్లిక్ చేసి.. రిజిస్టర్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత అక్కడ కనిపించే క్యాప్చా కోడ్ నమోదు చేసి గెట్ డేటాపై క్లిక్ చేయాలి. మీ అకౌంట్‌కు సంబంధించి ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్, అర్హత వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.