'ఏఐ కన్నా పెద్ద సంక్షోభాన్ని మర్చిపోతున్నాం'.. ఆనంద్ మహీంద్రా హెచ్చరిక

Wait 5 sec.

: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు ఒకటి తర్వాత ఒకటి లేఆఫ్స్ ప్రకటిస్తుండడం ఆ వాదనలకు బలం చేకూర్చుతోంది. ఏఐతో ఉద్యోగాలు పోతాయని ప్రపంచ వ్యాప్తంగా భయాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో దగ్గజ వ్యాపారవేత్త చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. వైట్ కాలర్ ఉద్యోగాలను ఏఐ తుడిచిపెడుతుందని మనం భయపడుతున్నాం కానీ అంతకన్నా పెద్ద సంక్షోభాన్ని మర్చిపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అదే నైపుణ్యవంతులైన శ్రామికిల కొరత అని పేర్కొన్నారు. 'ఫోర్ట్ సీఈఓ ఇటీవలే తన పాడ్ కాస్ట్‌లో ఓ ఆశ్చర్యకర విషయాన్ని భయటపెట్టారు. తమ కంపెనీలో 5 వేల మంది మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. వాటిలో చాలా పోస్టులకు 1,20,000 డాలర్లు (రూ.1 కోటికి పైగా) వార్షిక వేతనం ఉంటుంది. అయినప్పటికీ ఆ ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఇలా అమెరికావ్యాప్తంగా ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ట్రక్కింగ్, ఫ్యాక్టరీ రంగాల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇవి భవిష్యత్తు అంచనాలు కావు. ప్రస్తుత అంచనాలే. మనం దశాబ్దాలుగా డిగ్రీలు, డెస్క్ ఉద్యోగాలను ఉన్నతంగా భావిస్తూ వచ్చాం. నైపుణ్యం గల శ్రామిక శక్తిని అంతగా పట్టించుకోలేదు' అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. వీటికి జడ్జ్‌మెంట్, నేర్పు, శిక్షణ, అనుభవంతో కూడిన నైపుణ్యం అవసరమవుతాయని, మన సమాజంలో కలల కెరీర్‌గా భావించే వాటిలో సమూల మార్పులు చూడబోతున్నామని అన్నారు. ఎందుకంటే ఇదే ధోరణి కొనసాగితే ప్రపంచాన్ని నిర్మించి, మరమ్మతు చేయగల, నడిపించగల వ్యక్తులే వచ్చే ఏఐ యుగంలో అతిపెద్ద విజేతలుగా నిలుస్తారని చెప్పారు. పోరాటం ద్వారా కార్మికులు పైకి వస్తారని కార్ల్ మార్క్స్ ఊహించారని, కానీ, నైపుణ్యం, కొరత వంటి కారణాలతో వారు ఎదుగుతారని ఊహించలేదేమోనన్నారు. హింస ద్వారా కాకుండా శ్రామిక నైపుణ్యంతో ఏర్పడిన విప్లవం ఇది అంటూ ట్వీట్ చేశారు.