ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీధి కుక్కల కోసం ప్రత్యేతక ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ వీధుల్లో తిరిగే కుక్కల కోసం ప్రత్యేక ఆహార జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రోడ్లపై ఆహారం పెట్టడాన్ని నిషేధించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్‌ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. వీధుల్లో కుక్కలకు సంతాన నియంత్రణ సర్జరీలు, రేబిస్ వ్యాక్సిన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు అధికారులు. అందుకే ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా కు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేశారు. మున్సిపల్, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల కమిషనర్లకు సూచనలు చేశారు. వీధుల్లో కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల అవి ఒకే చోట గుమిగూడి సమస్యలు సృష్టిస్తున్నాయి. అందుకే ప్రత్యేక ఆహార జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 2024 జూన్ 1 నాటికి పట్టణ స్థానిక సంస్థల్లో 2,24,732 కుక్కలకు సంతాన నిరోధక సర్జరీలు చేయించామని అధికారులు తెలిపారు. మరో 1.36 లక్షల కుక్కలకు ఈ సర్జరీలు చేయించాల్సి ఉంది అన్నారు. ఈ ఆపరేషన్ల కోసం 45 చోట్ల ఆపరేషన్ థియేటర్లు, అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. 197 మంది శిక్షణ పొందిన సిబ్బందితో కుక్కలను పట్టుకుని సంరక్షించేందుకు అందుబాటులో ఉన్నారు. రేబిస్ వ్యాధి ప్రబలకుండా, కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు, రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సురేష్‌కుమార్‌ హెచ్చరించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నారు.ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసి రేబిస్‌ సోకిన శునకాలను గుర్తించి అవసరమైతే వాటిని ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్‌. అంతేకాదు ప్రమాదకరంగా ప్రవర్తించే కుక్కల్ని సంరక్షణ కేంద్రాల్లో పెట్టాలని నిర్ణయించారు. ఈ షెల్టర్లు అన్ని నగరపాలక సంస్థల్లో విధిగా ఏర్పాట్లు చేయాలి అన్నారు. దశల వారీగా మిగిలినచోట్లా కూడా వీటిని అమలు చేయాలన్నారు. శునకాల నియంత్రణ కార్యక్రమాలపై పర్యవేక్షణ కోసం రాష్ట్ర, నగర, పట్టణ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలి అన్నారు. సుప్రీం కోర్టు ఇటీవల వీధి కుక్కల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వాలు అవసరమైన చర్యలు చేపట్టారు.. ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.