తిరుమలలో ఫ్యామిలీ మొత్తం ఉచితంగా వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు.. రూమ్ కూడా ఫ్రీగానే, ఇలా చేస్తే చాలు

Wait 5 sec.

యువతను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడం. అలాగే, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వారికి తెలియజేయడం. దీని కోసం టీటీడీ ఒక వినూత్న ఆలోచన చేసింది. రామకోటి రాయడం ద్వారా భగవంతునిపై భక్తిని పెంచుకున్నట్లే, గోవింద నామస్మరణతో భక్తిని పెంపొందించుకోవచ్చని టీటీడీ భావిస్తోంది. గోవింద కోటి రాసేవారికి టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంది. ఎవరైతే ఈ గోవింద కోటిని పూర్తి చేస్తారో, వారికి, వారి కుటుంబ సభ్యులకు తిరుమలలో వీఐపీ దర్శనం లభిస్తుంది. ఇది భక్తులకు ఒక గొప్ప ప్రోత్సహిస్తోంది.తాజాగా మరో యువతి గోవింద కోటిని పూర్తి చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన నూతి పూజ హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వర్క్‌ ఫ్రం హోమ్‌లోనే పనిచేస్తున్నారు. ఆమె పనిచేస్తున్న ప్రాజెక్టు అమెరికాకు సంబంధించినది కావడంతో అర్ధరాత్రి వరకు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి వచ్చేది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉద్యోగ ఒత్తిడితో ఆమె మానసికంగా చాలా ఇబ్బంది పడేవారు.ఈ సమయంలో, అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. శ్రీవారి భక్తురాలైన పూజ, ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని, తాను కూడా స్వామివారి నామాలు రాయాలని నిర్ణయించుకున్నారు. మొదట లక్ష నామాలు రాయాలని అనుకున్నారు. కానీ నామాలు రాస్తున్నప్పుడు ఆమెకు ఎంతో ఆనందం కలిగింది. ఆ ఆనందంతో ఆమె రాయడం కొనసాగించారు. చివరికి, ఇటీవల పది లక్షల నామాలు పూర్తి చేశారు. మొత్తం 10,01,116 సార్లు గోవింద నామాలు రాశారు.టీటీడీ ఈ నెల 14వ తేదీన ఆమెకు ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. పూజ తన భర్త అభిషేక్‌తో కలిసి తిరుమల వచ్చారు. అక్కడ ఆమె తొలి గడప నుంచే శ్రీవారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా ఆఫ్‌లైన్ ద్వారా లక్కీ డిప్‌లో కూడా కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. తాను గోవింద నామాలు రాయడం మొదలుపెట్టిన తర్వాత పని ఒత్తిడిని అధిగమించగలిగాను అన్నారు పూజ. అంతేకాదు తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని.. చాలా ప్రశాంతత లభించిందన్నారు. స్వామివారి ఆశీస్సులతో తొలి గడప నుంచే ఆయన్ను దర్శించుకొనే అదృష్టం దక్కిందన్నారు. టీటీడీ 25 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న యువతీ యువకులు "గోవింద కోటి"ని 10,01,115 సార్లు రాస్తే, వారితో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ వీఐపీ బ్రేక్ దర్శనం లభిస్తుంది. ఈ గోవింద కోటి నామాల పుస్తకాలు 200 పేజీలు కలిగి ఉంటాయి. ప్రతి పుస్తకంలో 39,600 నామాలు రాసుకోవడానికి వీలుంటుంది. ఈ పుస్తకాలను టీటీడీ సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. 10,01,116 సార్లు 'గోవింద' నామం రాసి తిరుమలలోని టీటీడీ పేష్కార్ కార్యాలయంలో సమర్పించిన వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఈ లక్ష నామాల పుస్తకం పూర్తి చేయడానికి సుమారు 26 పుస్తకాలు అవసరమవుతాయని.. దీనికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని టీటీడీ అంచనా వేసింది. గత ఏడాది కర్ణాటకకు చెందిన ఒక ఇంటర్ విద్యార్థిని ఈ లక్ష నామాలు రాసి సమర్పించి మొదటగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. ఆ తర్వాత మరో ఇద్దరు భక్తులు కూడా గోవింద కోటి పూర్తి చేసి టీటీడీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం అందుకున్నారు.