ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్నాయి. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య సంరక్షణ, అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో ముఖ్యమైన నిర్ణయం తిసుకుంది. ఐదేళ్లలోపు చిన్నారుల కోసం ప్రభుత్వ ఆస్పత్రులలో (Nutrition Rehabilitation Center - NRC) ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఐదేళ్లలోపు వయసు గల .. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో 15 పోషకాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ (National Health Mission) కింద ఈ పోషహాకార పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.11 గిరిజన ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ పోషకాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 21 పోషకాహార పునరావాస కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సామర్థ్యం 340 పడకలు. కొత్తగా ఏర్పాటయ్యే 15 ఎన్ఆర్‌సీలతో మరో 115 పడకలు అందుబాటులోకి వస్తాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. పోషకాహార పునరావాస కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు వారాల పాటు వైద్యం, పౌష్టికాహారం అందిస్తారని మంత్రి వివరించారు.కొత్తగా ఏర్పాటు చేయబోయే పోషకాహార పునరావాస కేంద్రాల వివరాలు అరకు ప్రాంతీయ ఆసుపత్రిముంచింగిపుట్టు సీహెచ్‌సీచింతపల్లి సీహెచ్‌సీ అడ్డతీగల సీహెచ్‌సీరామవరం సీహెచ్‌సీ అనకాపల్లి జిల్లా ఆసుపత్రినరసారావుపేట ప్రాంతీయ ఆసుపత్రి బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రి సున్నిపెంట ప్రాంతీయ ఆసుపత్రినంద్యాల జీజీహెచ్సాలూరు ప్రాంతీయ ఆస్పత్రి పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రిభద్రగిరి సీహెచ్‌సీకురుపాం సీహెచ్‌సీచిన్నమరంగి సీహెచ్‌సీపోషకాహార పునరావాస కేంద్రాలు.. అంటే ఏమిటి?పోషకాహార పునరావాస కేంద్రం (NRC).. ఆరోగ్య కేంద్రంలోని ఒక యూనిట్. తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లలను ఈ కేంద్రాలలో చేర్చుకుంటారు. వారికి వైద్యం, పౌష్ఠికాహారం అందిస్తారు. చిన్నారుల పోషణ, సంరక్షణ విధానాల గురించి వారి తల్లికి లేదా కేర్ టేకర్‌కు వివరిస్తారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తుంటారు. చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పిల్లల తల్లిదండ్రులకు సహకారం, అవగాహన అందిస్తుంటారు.