తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన '' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి బుధవారం (నవంబర్ 19) ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంపై మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారితో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతీ మహిళకు నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా, నాణ్యమైన చీరలను అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కోటి చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులే తయారు చేస్తున్నారు. ఈ భారీ ఆర్డర్ ద్వారా స్థానిక చేనేత పరిశ్రమకు , కార్మికులకు ఆర్థికంగా భారీ చేయూత లభించనుంది.పంపిణీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగేలా సాంకేతికతను వినియోగించుకోవాలని, నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సీఎం సూచించారు. పెద్ద సంఖ్యలో చీరలు ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో.. పంపిణీ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండేందుకు, ముఖ్యమంత్రి దీనిని రెండు దశల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి దశలో భాగంగా.. ఇందిరా గాంధీ గారి జయంతి రోజు నుంచి ప్రారంభించి.. డిసెంబరు 9 (తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం) వరకు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు చీరల పంపిణీ పూర్తి చేయాలి. మిగిలిన పట్టణ ప్రాంతాల్లోని (Urban Areas) మహిళలకు మార్చి 1 నుంచి మార్చి 8 వరకు చీరల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలతో నేరుగా ముఖాముఖి మాట్లాడనున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల గౌరవాన్ని పెంచడంతో పాటు, చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యం.