: ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత.. ఆ సంవత్సరంలో నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే దానిపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చెల్లించాల్సిన అసలు పన్ను కంటే ఎక్కువ మొత్తం ప్రభుత్వానికి చెల్లించినప్పుడు.. ఆ అదనపు మొత్తాన్ని తిరిగి పొందొచ్చు. దీనిని ఇన్‌కం టాక్స్ రిఫండ్ (పన్ను వాపసు) అంటారు. చివరికి పన్ను లెక్కల ద్వారా మినహాయింపులు, తగ్గింపులు అన్నీ చూసి.. . సాధారణంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత 30 రోజుల్లోపు ఇ- వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ధ్రువీకరణ పూర్తయ్యాక.. ఆదాయపు పన్ను శాఖ మీ ఐటీఆర్‌ను ప్రాసెస్ చేసేందుకు 20-45 రోజుల వరకు సమయం పడుతుంది. ప్రాసెస్ పూర్తయ్యాక.. 2-10 రోజుల్లో బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అంటే మొత్తంగా రోజుల నుంచి నెలల్లోగా టాక్స్ రిఫండ్ వస్తుంది.>> కొందరికి టాక్స్ రిఫండ్ తొందరగానే పడుతుంటుంది. ఇంకొందరికి నెలలు గడుస్తున్నా పన్ను వాపసు రానేరాదు. పని లేదు. టాక్స్ పేయర్ తప్పులేకుండా రిఫండ్ ఆలస్యమైతే.. ప్రభుత్వం అప్పుడు మీకు రిఫండ్ మాత్రమే కాకుండా దానిపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ప్రకారం ఆలస్యమైనటువంటి రిఫండ్ మొత్తంపై పన్ను శాఖ.. నెలకు 0.5 శాతం చొప్పున సాధారణ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది సంవత్సరానికి 6 శాతంగా ఉంటుంది. ప్రస్తుత ఐటీఆర్ గడువు తేదీ 2025 సెప్టెంబర్ 16తో చూస్తే.. ఆలోపు ఐటీఆర్ ఫైల్ చేసి ఉంటే.. వడ్డీ లెక్కించే కాలం ఏప్రిల్ 1 నుంచి రిఫండ్ చెల్లించే తేదీ వరకు ఉంటుంది. గడువు దాటిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే అప్పుడు ఐటీఆర్ ఫైల్ చేసినప్పటి నుంచి రిఫండ్ చెల్లించే వరకు వడ్డీని లెక్కిస్తారు. ఇక్కడ మీరు టీడీఎస్ లేదా అడ్వాన్స్ టాక్స్ లేదా సెల్ఫ్ అసెస్మెంట్ టాక్స్ ద్వారా అధిక పన్ను చెల్లించినప్పుడు.. మీ తరఫున ఎలాంటి పొరపాటు లేనప్పుడు వడ్డీ పొందేందుకు అర్హత సాధిస్తారు. అదే ఆలస్యం అనేది పన్ను చెల్లింపుదారుడి పొరపాటుతో జరిగినట్లయితే వడ్డీ రాదు. ఇక్కడ అసంపూర్తి సమాచారం ఇవ్వడం, తప్పుడు వివరాలు, తప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం సహా నోటీసులకు నిర్దిష్ట సమయంలో స్పందించకపోవడం వంటివి టాక్స్ పేయర్ పొరపాట్ల కిందికి వస్తాయి. మీ రిఫండ్ మొత్తం రూ. 100 కంటే తక్కువగా ఉంటే కూడా వడ్డీ రాదు. రిఫండ్ ఆలస్యం అయ్యేందుకు కారణాలివే..ఐటీఆర్ ఫైల్ చేశాక.. రిఫండ్ లేట్ అయ్యేందుకు చాలానే కారణాలు ఉంటాయి. ఇక్కడ ముందుగా డేటా సరిపోలకపోవడం గురించి మాట్లాడుకోవాలి. ఫారం 26AS, AIS లేదా TIS లో పొందుపర్చిన ఆదాయ వివరాలకు, ఐటీఆర్ వివరాలకు తేడా ఉండటం.. టీడీఎస్/టీసీఎస్ క్రెడిట్ సరిపోలకపోవడం వల్ల ఆలస్యం అవ్వొచ్చు.ఇన్‌కంటాక్స్ ఇ- ఫైలింగ్ పోర్టల్‌లో బ్యాంక్ అకౌంట్‌ను ముందుగా ధ్రువీకరించకపోవడం వల్లమీ పాన్ కార్డును.. ఆధార్ కార్డుతో లింక్ చేయకపోవడం వల్ల పాన్ కార్డు ఇనాపరేటివ్ అవుతుంది. అప్పుడు కూడా రిఫండ్ నిలిచిపోతుంది. ఐటీఆర్ ఫైల్ చేసిన 30 రోజుల్లోపు ధ్రువీకరించకపోతే (ఇ- వెరిఫై) రిటర్న్ చెల్లదు.క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, విదేశీ ఆదాయం, ఇతర ఆదాయ వనరులు ఎక్కువగా ఉంటే వీటిపై నిశితంగా దృష్టి సారించడం వల్ల ఆలస్యం అవుతుంది. మునుపటి సంవత్సరాల నుంచి పెండింగ్‌లో టాక్స్ డిమాండ్స్ ఉంటే రిఫండ్ ఆగిపోతుంది.