ఏపీలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ, అగ్రనేత హిడ్మా హతం

Wait 5 sec.

నక్సల్ కంచుకోట కూలిపోయింది. భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న అయ్యారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీష్ గుప్తా ప్రకటించారు.మంగళవారం (నవంబర్ 18) ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాప్పులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు.. కూంబింగ్ నిర్వహించారు. అనంతరం మావోయిస్టులు కాల్పులు జరపగా.. పోలీసులు ఎజురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, హేమతో పాటు వీరికి సెక్యూరిటీగా ఉన్న నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం.ఆ దాడితో మార్మోగిన హిడ్మా పేరు..ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన మాడ్వి హిడ్మా మురియా తెగకు చెందిన ఆదివాసీ. బాలసంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. హిడ్మా విప్లవ భావాలను నరనరాన ఎక్కించుకున్న హిడ్మా.. మావోయిస్టులు నడిపే స్కూల్‌లో విప్లవ అక్షరాలు దిద్దారు. కిషన్‌ జీ ఆలియాస్‌ భద్రన్న నేతృత్వంలో సాయుధపోరులో అడుగులు వేశారు. ఆపై జేగురుగొండ ప్రాంత దళ కమాండర్‌గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు.. ఆధ్వర్యంలో జరిగిన చింతల్నార్‌ –టేకుమెట్ల దాడిని ముందుండి నడిచారు. ఈ దాడిలో 76 మంది సీర్‌ఆర్‌పీఎఫ్‌ జవాన్లు చనిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నారు మాడ్వి హిడ్మా. దాదాపు 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన హిడ్మా.. అప్పట్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడిగా ఉన్నాడు.