తిరుమల శ్రీవారికి HCL భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తం.. భక్తులకు ఉచితంగానే!

Wait 5 sec.

తిరుమల శ్రీవారిని ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని కానుకలు, విరాళాలను అందజేస్తున్నారు. బంగారం, డబ్బులు, విలువైన వస్తువులు, వాహనాలు కూడా ఇస్తుంటారు. టీటీడీ ట్రస్టులకు తిరుమల శ్రీవారి భక్తులతో పాటుగా ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు. తాజాగా టీటీడీకి మరో భారీ విరాళం ఇచ్చారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోషణి నాడర్ బర్డ్ ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళం అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఛైర్మన్ అభినందించారు. బర్డ్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలు, శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.. మిగిలిన రోగులకు నామమాత్రపు ఫీజులతో వైద్యం అందిస్తారు.టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీటీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు‌. వచ్చే వేసవిలో తెలుగు రాష్ట్రాలలో 8,9,10 తరగతి విద్యార్థులకు ”సద్గమయ” అను కార్యక్రమం ద్వారా నైతిక విలువలు, మానవీయ ధర్మాలు, వ్యక్తిత్వ నిర్మాణానికై శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనకు రిజిస్టర్ అయిన 7856 భజన బృందాలు నైపుణ్యాన్ని పరిశీలించి జిల్లాస్థాయిలో భజన ప్రదర్శనలను ఏర్పాటు చేసి వాటిని క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు జానకిదేవి, మహేందర్ రెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు. తిరుమల మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం'ఈనెల 19వ తేది తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఉదయం 10గంటలకు ప్రత్యేక అభిషేకం జరగనుంది. కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అర్చకులు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు' అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లికార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు , కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు. నవంబర్ 19వ తేదీన ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి సింహ వాహనంపై శ్రీ పద్మావతీ అమ్మవారు విహరిస్తూ భక్తులను ఆశీర్వదించనున్నారు.