తెలంగాణలో 18 ఏళ్లు నిండిన మహిళలకు.. నెలకు రూ.2500.. కీలక అప్‌డేట్..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మితిమీరిన అప్పులే కారణమని రాష్ట్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం నాడు పెద్దకొత్తపల్లిలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎన్నికల హామీల అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బదులిచ్చారు.మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం వంటి పథకాలు ఏమయ్యాయని కొందరు మాట్లాడుతున్నారని అన్నారు. ‘ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు కేవలం లక్ష రూపాయలు ఇస్తున్నందుకే సంవత్సరానికి రూ.4,000 కోట్ల ఖర్చు అవుతోంది’ అని ఆయన వివరించారు.హామీల అమలుపై ఆర్థిక భారం.. ఒకవేళ తులం బంగారం పథకాన్ని కూడా అమలు చేస్తే.. దానికి అదనంగా దాదాపు మరో రూ.4,000 కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు. అలాగే.. తెలంగాణలో అమలు చేయాలంటే సంవత్సరానికి దాదాపు రూ.10,000 కోట్ల ఖర్చు అవుతుంది. ఈ రెండు పథకాలకు కలిపి సుమారుగా రూ.15,000 కోట్ల అదనపు ఖర్చు అవుతుందని మంత్రి లెక్కలు చెప్పారు.ఈ భారీ ఖర్చులను భరించడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అనుకూలంగా లేకపోవడానికి గల కారణాన్ని ఆయన స్పష్టం చేశారు. ‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు మేము అప్పు చేసి వడ్డీ కడుతున్నాం. గత ప్రభుత్వం తెచ్చిన అప్పుల వడ్డీలకే ప్రతి ఏడాది రూ.75,000 కోట్లు చెల్లించాల్సి వస్తోంది’ అని జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇంతలా అప్పులు చేసి ఉండకపోతే.. ఆ వడ్డీలను కట్టాల్సిన అవసరం ఉండేది కాదు, తద్వారా తాము ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసే అవకాశం ఉండేది కదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలతో పాటు, ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తోందని జూపల్లి స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమంత్రులందరూ చేసిన అప్పుల కంటే పది రెట్లు అధికంగా కేసీఆర్ అప్పులు చేశారని ఆరోపించారు.మంత్రి తన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేసుకుంటూ.. గతంలో కొల్లాపూర్‌లో సరైన రోడ్లు కూడా లేవని చంద్రబాబు వంటి వారు హేళన చేశారని.. కానీ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థించి అభివృద్ధి పనులు చేయించానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరలు కూడా నాణ్యతతో రాజీ పడకుండా తయారు చేయించామన్నారు. అందుతాయన్నారు.