Loneliness: టీమిండియా తరఫున ఆడిన స్టార్ క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకరు. ఇక యువీ తండ్రి గురించి వినే ఉంటారు. ఎక్కారు. ఒంటరితనంపై, వ్యక్తిగత జీవిత సంబంధాలపై ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వ్యక్తిగతంగా తాను పడుతున్న బాధ గురించి వివరించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఒంటరితనంలో ఉండలేకపోతున్నానని.. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. తన జీవితం ఇక పూర్తయినట్లేనని చెప్పుకొచ్చారు. భార్యా పిల్లలకు దూరంగా ఒంటరిగా జీవిస్తున్నానని వాపోయారు. 'నేను సాయంత్రం ఇంట్లో ఒంటరిగా కూర్చుంటాను. పక్కన ఎవరూ ఉండరు. ఆహారం కోసం ఎక్కువగా అపరిచితులపై ఆధారపడాల్సి వస్తుంది. నాకు ఆహారం వేసినప్పుడు.. ఒక్కోసారి ఒక్కొక్కరు ఆహారం ఇస్తుంటారు. నేను ఇంట్లో సహాయకుల్ని, వంటవారిని పెట్టుకున్నాను. వారు పనిచేసి వెళ్లిపోయేవారు.' అని యోగ్‌రాజ్ సింగ్ కామెంట్స్ చేశారు.తన కుటుంబ సభ్యుల్ని.. తల్లి, పిల్లలు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు ఇలా అందరినీ ప్రేమిస్తానని.. కానీ వారిని ఏమీ అడగనని అన్నారు. 'నేను ఇప్పుడు చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నా. నా జీవితం పూర్తయింది. దేవుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నన్ను తీసుకెళ్లొచ్చు.' అని పేర్కొన్నారు యోగ్‌రాజ్ సింగ్. భార్య షబ్నమ్ కౌర్, కుమారుడు యువరాజ్ సింగ్ తనను విడిచివెళ్లడమే జీవితంలో అతిపెద్ద షాక్ అని 67 ఏళ్ల యోగ్‌రాజ్ సింగ్‌ తెలిపారు. 'యువీ, వాళ్ల అమ్మ నన్ను విడిచి వెళ్లినప్పుడు అదే నాకు అతిపెద్ద షాక్. నా జీవితం అంతా ఎవరి కోసం అంకితం చేశానో.. వారు కూడా నన్ను విడిచి వెళ్లిపోతారా?' అని యోగ్‌రాజ్ సింగ్ ప్రశ్నించారు. తనకు తాను అమాయకుడని చెప్పుకున్న యోగ్‌రాజ్.. జీవితంలో ఇలా ఒంటరితనం అనుభవించడానికి ఏం తప్పు చేశానో అర్థం కాట్లేదని అన్నారు. యోగ్‌రాజ్ సింగ్ విషయానికి వస్తే.. భారత్ తరఫున ఒక టెస్ట్, 6 వన్డేలు ఆడారు. గాయాల కారణంగా.. కొనసాగించారు. యువీకి కూడా క్రికెట్ పాఠాలు నేర్పారు. ఆయన సినిమాల్లోనూ నటించారు. వ్యక్తిగత విషయాలకు వస్తే.. తొలి వివాహం షబ్నమ్ కౌర్‌తో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు యువరాజ్ సింగ్, జొరావర్ ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా షబ్నమ్.. యువీని తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చారు. తర్వాత సత్బీర్ కౌర్‌ను వివాహం చేసుకోగా.. వీరికి కుమారుడు విక్టర్ సింగ్, కుమార్తె అమర్‌జోత్ కౌర్‌ జన్మించారు. అయితే వీరు కూడా తనను విడిచి అమెరికా వెళ్లిపోయినట్లు యోగ్‌రాజ్ వివరించారు.