5 రోజుల్లోనే షేర్ ధర డబుల్.. బిలియనీర్ అయిన రైతుబిడ్డ.. లక్ష కోట్లు దాటిన విలువ!

Wait 5 sec.

Today: ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ సంస్థ గ్రో పేరెంట్ కంపెనీ అయిన బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీ ఇటీవల ఐపీఓగా స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 12న ఇది స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయింది. ఇష్యూ ధర కేవలం రూ. 100గానే ఉండగా.. . ఇది సాధారణంగానే ఉందని అంతా అనుకున్నారు. అయితే అక్కడి నుంచి దుమ్మురేపుతోంది. వరుస సెషన్లలో అంతకంతకూ పెరుగుతూ పోతోంది. నవంబర్ 12, 13, 14, 17, 18 ఇలా 5 రోజుల వ్యవధిలో (నవంబర్ 15,16- హాలిడే) ఏకంగా షేర్ ధర సుమారు రెట్టింపు కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇందులో ఇన్వెస్టర్లకు కూడా కాసుల పంట పండింది. మంగళవారం సెషన్‌లో ఇంట్రాడేలో 11 శాతం వరకు పెరగడంతో రూ. 193.80 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఇదే ఆల్ టైమ్ హై కావడం విశేషం. పెరిగిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో పెట్టుబడి పెట్టిన వారికి దాదాపు రెట్టింపు లాభాలు అందాయి. ఈ ర్యాలీ నేపథ్యంలో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.20 లక్షల కోట్ల మార్కును కూడా దాటేసింది. దీంతో ప్రత్యర్థి బ్రోకరేజీ కంపెనీలు ఏంజెల్ వన్, ఆనంద్ రాఠీ వంటి కంపెనీల మార్కెట్ విలువను కూడా అధిగమించింది. గ్రో స్టాక్ దూసుకెళ్లిన నేపథ్యంలో.. కంపెనీ సీఈఓ, కో ఫౌండర్‌గా ఉన్నటువంటి లలిత్ కేశ్రే కొత్త బిలియనీర్‌గా అవతరించడం విశేషం. గ్రో కంపెనీలో ఈయనే మెజార్టీ షేర్ హోల్డర్‌గా ఉన్నారు. ప్రమోటర్లలో ఈయన ఒకరు. కేశ్రే దగ్గర మొత్తం 9.06 శాతం వాటాకు సమానమైన 55,90,64,671 (55.91 కోట్లు) షేర్లు ఉన్నాయి. దీంతో మంగళవారం స్టాక్ గరిష్ట ధర దగ్గర చూస్తే కేశ్రే సంపద విలువ రూ. 10 వేల కోట్ల మార్కు దాటేసింది. డాలర్లలో చెప్పాలంటే ఇది 1.12 బిలియన్ డాలర్లకుపైనే ఉంటుంది. సాధారణంగా.. ఒక బిలియన్ యూఎస్ డాలర్ల సంపద ఉంటే.. బిలియనీర్‌గా పిలుస్తుంటారు. దీంతో కేశ్రే కూడా బిలియనీర్ అయ్యారు. కేశ్రే రైతుబిడ్డ..లలిత్ కేశ్రే విషయానికి వస్తే.. ఈయన మధ్యప్రదేశ్‌లోని మారుమూల గ్రామం లెపాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అక్కడ అందుబాటులో లేకపోవడంతో తన తాతయ్య ఉండే ఖర్గోన్ వెళ్లారు. స్థానిక భాషలోనే విద్యనభ్యసించిన లలిత్ కేశ్రే.. జేఈఈలో మంచి ర్యాంక్ సాధించి.. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థ ఐఐటీ బాంబేలో చేరారు. అక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. వృత్తి జీవితం విషయానికి వస్తే తొలుత ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేశారు. ప్రొడక్ట్ మేనేజర్లలో ఒకరిగా విధులు నిర్వర్తించిన లలిత్.. ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌ప్లేస్‌ను తీర్చిదిద్దడంలో కీలకంగా వ్యవహరించారు. 2016లో తన సహచరులు.. ఫ్లిప్‌కార్ట్‌లోనే పనిచేసిన హర్ష్ జైన్, ఇషాన్ బన్సల్, నీరజ్ సింగ్‌తో కలిసి ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫాం గ్రోను ప్రారంభించారు. ఇది పెద్ద ఎత్తున అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించింది. 2021లో ఈ సంస్థ 1 బిలియన్ డాలర్ల విలువను దాటి యూనికార్న్ క్లబ్‌లోకి ప్రవేశించింది.