ట్యాక్స్‌ల భారం మోయలేక.. బ్రిటన్‌కు గుడ్‌ బై చెప్పిన లక్ష్మీ మిట్టల్.. ఇక ఆ దేశంలో నివాసం

Wait 5 sec.

Lakshmi Mittal: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఊహించినట్లుగానే బ్రిటన్‌కు గుడ్ బై చెప్పేశారు. మూడు దశాబ్దాలుగా యూకేలో నివసిస్తున్న ఆయన, ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు నిర్ణయాలతో ఆ దేశాన్ని వీడారు. బ్రిటన్‌లోని అత్యంత ధనవంతుల్లో టాప్ 10లో కొనసాగుతున్న లక్ష్మీ మిట్టల్ ఆ దేశాన్ని విడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యూకే మీడియా కథనాలు ప్రచురించింది. బ్రిటన్ నుంచి ఆయన స్విట్జర్లాంట్‌కు మారినట్లు పేర్కొంది. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ వర్క్స్ () వ్యవస్థాపకులు లక్ష్మీ మిట్టల్ ఆస్తుల విలువ సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం 15.4 బిలియన్ పౌండ్లుగా ఉంది. భారత కరెన్సీలో ఆ విలువ దాదాపు రూ.1.80 లక్షల కోట్లుగా ఉంటుంది. దీంతో యూకేలోని అత్యంత ధనవంతుల్లో ఆయన 8వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ 75 ఏళ్ల పారిశ్రామికవేత్త బ్రిటన్‌ను వీడుతోన్న సుమారు 16 వేల మంది బిలియనీర్లలో తాజా వ్యక్తిగా బ్రిటన్ మీడియా పేర్కొంది. నవంబర్ 26, 2025 రోజున ఛాన్సలర్ రచెల్ రీవ్స్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముందే ఆయన బ్రిటన్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఈ బడ్జెట్‌లోనే ప్రతిపాదిత 20 శాతం ఎగ్జిట్ ట్యాక్స్ సహా మాన్సన్ ట్యాక్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆమె 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనే నాన్ డొమిసైల్ ట్యాక్స్ రెజిమ్ రద్దు చేశారు. యూకేలో 40 శాతం వారసత్వపు ట్యాక్సును తప్పించుకునేందుకు విదేశాల్లోని ట్రస్టులను ఉపయోగించుకోవడాన్నీ తొలగించారు. నాన్-డోమిసైల్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని లేబర్ పార్టీ నేతృత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ధనవంతులు ఆలోచనల్లో పడ్డారు. ఈ పన్ను విధానం కింద యూకే నివాసితులు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 226 ఏళ్లుగా ఈ పన్ను మినహాయింపు వెసులుబాటు కొనసాగుతోంది. అక్కడి సంపన్నులు యూకేను వీడి పన్ను మినహాయింపులు ఎక్కుగా ఉండే ఇతర దేశాలకు వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నట్లు లక్ష్మీ మిట్టల్ నిర్ణయంతో స్పష్టమవుతోంది. స్విట్జర్లాండ్‌కు మకాంలక్ష్మీ మిట్టల్‌ కుటుంబం బ్రిటన్ నుంచి స్విట్జర్లాండ్‌కు మారిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఎక్కువ సమయం దుబాయ్‌లోనే గడుపుతారని సమాచారం. మిట్టల్ కుటుంబానికి ఇప్పటికే దుబాయ్‌లో ఓ లగ్జరీ ఇల్లు ఉండగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని నయా ద్వీపంలో మరో లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశారని వార్తాపత్రిక పేర్కొంది. ఐరోపా, అమెరికాలో ఆయనకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి. లండన్‌లోని ప్రఖ్యాత కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్ ప్రాంతంలో ఆయనకు ఒక విలాస భవంతి సైతం ఉంది. అయితే ఆయన దుబాయ్‌లో ఎక్కవగా పెట్టుబడులు పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం యూకేలో పన్ను మినహాయింపులు రద్దు చేయడంతో ఆయన స్విట్జర్లాండ్‌కు మకాం మార్చారు. స్టీల్ ఉత్పత్తిలో ఆర్సెలార్ మిట్టల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 24 బిలియన్ యూరోల విలువైన ఆ కంపెనీలో లక్ష్మీ మిట్టల్ కుటుంబానికి 40 శాతం వరకు వాటా ఉంది. 2021లో లక్ష్మీ మిట్టల్ సీఈఓగా దిగిపోయి ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్‌కు బాధ్యతలు అప్పగించారు.భారత్‌లోని రాజస్థాన్‌లో జన్మించిన లక్ష్మీ మిట్టల్ కుటుంబం 1995లో లండన్‌కు వెళ్లింది. కెన్సింగ్టన్ ప్యాలస్ గ్రెడన్స్‌లోని మూడు భవనాలను కొనుగోలు చేసి నివాసం ఉంటోంది. గత 30 ఏళ్లుగా బ్రిటన్‌లో ఒక కీలక పారిశ్రామిక కుటుంబంగా మిట్టల్ ఫ్యామిలీ కొనసాగుతోంది. అత్యంత ధనవంతుల్లో టాప్ 10లో కొనసాగడంతో పాటు లేబర్ పార్టీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు అదే లేబర్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబం బ్రిటన్‌ను వదిలేసేలా చేసిందని చెప్పవచ్చు.