RBI: బ్యాంకులు, బ్యాంకింగేతర ఫైనాన్షియల్ సంస్థలు సహా ఇతర ఆర్థిక కంపెనీల్లో ఖాతాదారులు, కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని ఆదేశించింది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను బుధవారం జారీ చేసింది. వినియోగదారుల సమస్యలు వేగంగా, అర్థవంతంగా పరిష్కారమయ్యేలా చూడటమే ఇంటర్నల్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. కమెర్షియల్, పేమెంట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థలక ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని స్పష్టం చేసింది. జనరల్ మేనేజర్ స్థాయికు సమానమైన హోదా ఉన్న వ్యక్తి, సర్వీసులో ఉన్న లేదా పదవీ విరమణ చేసిన అధికారి ఈ పదవిలో ఉండాలని తెలిపింది. వీరికి బ్యాంకింగ్ రూల్స్, పర్యవేక్షణ, వినియోగదారుల రక్షణ వంటి అంశాల్లో కనీసం 7 సంవత్సరాలు అనుభవం ఉండాలని తెలిపింది. బ్యాంకుల్లో ఉండే అంబుడ్స్‌మన్‌లు వినియోగదారులు, ఖాతాదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించరు. బ్యాంకు లేదా ఆర్థిక కంపెనీ అప్పటికే పరిశీలించి, పాక్షికంగా పరిష్కరించిన లేదా పూర్తిగా తిరస్కరించిన ఫిర్యాదులను మాత్రమే ఈ అంబుడ్స్‌మన్‌ సమీక్షిస్తుంది. వినియోగదారుల ఫిర్యాదును తిరస్కరించే ముందు ఆర్థిక సంస్థలోని అత్యున్నత స్థాయి అధికారి అంబుడ్స్‌మన్ పరిశీలన జరపాలన్నది ఈ కొత్త మార్గదర్శకాల ఉద్దేశం. ఈ కొత్త మార్గదర్శకాల అమలు, వినియోగదారుల సర్వీసుల్లో లోపాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక విభాగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని కేంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది. ఆ ఫిర్యాదు ఆటోమేటిక్‌గా బ్యాంక్ లోని ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ కార్యాలయానికి రివ్యూ కోసం వెళ్తుంది. కస్టమర్ మళ్లీ అడగాల్సిన పని లేకుండానే ఈ సమీక్ష జరుగుతుంది. కస్టమర్ ఫిర్యాదును తిరస్కరించే ముందు బ్యాంకులోని ఉన్నత స్థాయి అధికారులు దానిని క్షుణ్ణంగా పరిశీలించాలి. అదే బ్రాంచ్ లేదా కింది స్థాయి సిబ్బంది ఫిర్యాదులను క్లోజ్ చేసే అధికారం ఉండదు.