ముంబై మేయర్ పీఠంపై షిండే సేన పట్టు.. రిసార్టులోనే లీడర్‌ను ఎన్నుకోనున్న కార్పొరేటర్లు

Wait 5 sec.

మేయర్ పీఠం చిక్కుముడి మాత్రం వీడటం లేదు. ఈ బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ, షిండే శివసేన నేతృత్వంలోని మహాయుతి కూటమి 118 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. మేయర్ పీఠం కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ 114 కాగా.. ఇప్పుడు షిండే శివసేన కింగ్ మేకర్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే తమ 29 మంది కార్పొరేటర్లను ఏ పార్టీ లాక్కోకుండా ఉండేందుకు వారిని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆ పార్టీ అధినేత ఈ క్రమంలోనే నేడు వారి గ్రూప్ లీడర్‌ను ప్రకటించడంతో పాటు.. కావాల్సిన డాక్యుమెంటరీ పనులను పూర్తి చేస్తున్నారు. బీజేపీతో పొత్తులో భాగంగా దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయం ప్రకారం.. మేయర్ పీఠం తనకే దక్కాలని పట్టుబడుతుండగా.. ఇదే ఇప్పుడు ముంబై రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ప్రత్యర్థి పార్టీల నుంచి తమ కార్పొరేటర్లకు ప్రలోభాలు ఎదురుకాకుండా ఉండేందుకు.. షిండే సేన ఈ రిసార్ట్ రాజకీయాలను చేస్తోంది. 29 మంది కార్పొరేటర్లను కేవలం హోటల్‌కు తరలించడమే కాకుండా.. వారి నుంచి అవసరమైన అఫిడవిట్లు, డాక్యుమెంటరీ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. దాని వల్ల టెక్నికల్‌గా ఎలాంటి అనర్హత వేటు పడకుండా.. ఫిరాయింపులకు అవకాశం లేకుండా జాగ్రత్త పడుతున్నారు.రేసులో ముగ్గురు కీలక నేతలుఇక షిండే శివసేన కార్పొరేటర్ల గ్రూప్ లీడర్‌ను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఈ రేసులో అనుభవజ్ఞులైన మహిళా నేతలు యామినీ జాదవ్, త్రిష్ణా విశ్వాస్ రావుతో పాటు యువ నేత అమేయ ఘోలే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి మేయర్ లేదా స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ వంటి కీలక పదవులు దక్కే అవకాశం ఉంది.మేయర్ పీఠంపై పట్టుముంబై బీఎంసీలో దశాబ్దాలుగా శివసేన పార్టీకి చెందిన వారే మేయర్ ఉంటున్నారు. ఇప్పుడు బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. షిండే సేన మద్దతు లేకుండా మేయర్ పీఠం దక్కించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. తానే అసలైన శివసేన అని నిరూపించుకోవడానికి ఏక్‌‍నాథ్ షిండే తన పార్టీకే మేయర్ పదవి ఇవ్వాలని బీజేపీపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోవైపు.. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్ ఎప్పుడూ కాలేదని.. ఈసారి ఆ అవకాశం తమకే ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. దీంతో ఈ ప్రతిష్ఠంభన వీడటం లేదు.బీఎంసీ ఫలితాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లుమహాయుతి కూటమి (118 స్థానాలు)బీజేపీ 89 సీట్లు షిండే సేన 29 స్థానాలు ప్రతిపక్షం (72 స్థానాలు)ఇతరులు (34 స్థానాలు) విమర్శలు - ప్రతి విమర్శలుషిండే శివసేన కార్పొరేటర్లను హోటల్‌కు తరలించడంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. ఒకసారి పార్టీని వీడి వెళ్లిన వారు మళ్లీ ఎప్పుడైనా వెళ్లవచ్చు.. అందుకే షిండే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన షిండే శివసేన నేతలు.. తమ కార్పొరేటర్లను ఎవరూ ప్రలోభపెట్టకుండా ఉండటానికే వారిని హోటల్‌కు తరలించామని.. తమలో ఐక్యత ఉందని స్పష్టం చేశారు. ఇక ముంబై మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఏక్‌నాథ్ షిండే త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.