సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి చాలా మంది సొంతూళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో గత ఐదారు రోజులుగా హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి (NH-65) ప్రయాణికుల వాహనానలతో రద్దీగా మారింది. కేవలం సాగించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఒక్కవైపే 2.04 లక్షల వాహనాలు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకొని తిరుగుముఖం పడుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ హైవేలో పలు చోట్ల నిర్మాణ పనులు జరుగుతున్నందున దారి మళ్లింపులు చేపడుతున్నారు. (ఎన్‌హెచ్-65)పై బ్లాక్ స్పాట్స్ వద్ద ఫ్లైఓవర్, అండర్ పాస్‌ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి వెళ్లిన వారు తిరిగి వస్తున్నందున.. బ్లాక్ స్పాట్స్ వద్ద వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా అద్దంకి – నార్కెట్‌పల్లి హైవే మీదుగా హైదరాబాద్ వచ్చే వాహనాలు.. నార్కట్‌పల్లి వద్ద ఎన్‌హెచ్ 65లో కలుస్తాయి. దీంతో హైదరాబాద్ – విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహన దారులు.. ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ మళ్లించే మార్గాలు ఇవే.. గుంటూరు - మిర్యాలగూడ - హాలియా - కొండమల్లేపల్లి - చింతపల్లి - మాల్ వైపు మళ్లింపుమాచర్ల - నాగార్జునసాగర్ - పెద్దవూర - కొండమల్లేపల్లి - చింతపల్లి - మాల్ వైపు మళ్లింపునల్లగొండ - మార్రిగూడ బైపాస్ - మునుగోడు - నారాయణపూర్ - చౌటుప్పల్ (NH-65)కాగా, విజయవాడ నుంచి వచ్చే భారీ వాహనాలు కోదాడ –హుజూర్నగర్ – మిర్యాలగూడ – హాలియా – చింతపల్లి – మాల్ వైపు మళ్లింపు NH-65లో ట్రాఫిక్ జామ్ అయితే.. చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తారు. కాగా, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లు, సీసీటీవీలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు అధికారులు. ప్రయాణంలో అత్యవసరమైతే డయల్ 100ను సంప్రదించాలని తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం వాహనదారులు పోలీసుల సూచనలు పాటించి ఓర్పుతో ప్రయాణించాలని చెప్పారు.