మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు ఎంతంటే?

Wait 5 sec.

Hyderabad Gold Rate: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా మహిళలు.. బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేస్తూ.. ధరిస్తుంటారు. పండగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. బంగారు ఆభరణాలు అనేవి మహిళల అందాన్ని మరింత పెంచుతాయి కూడా. ఇంకా బంగారం కేవలం అలంకరణ సామగ్రిగానే కాదు.. సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది. అందుకే.. బయట వీలైనంత ఎక్కువ బంగారం కనిపించేలా ధరిస్తుంటారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అనిశ్చితి, ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం అనేది సురక్షిత పెట్టుబడి సాధనంగా మారిపోయింది. దీంతో డిమాండ్ ఎక్కువగా పెరిగింది. కేవలం అలంకరణగానే కాకుండా.. పెట్టుబడి సాధనంగానూ పనిచేస్తుంది. బంగారంతో పాటుగా వెండిపైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌లో సంక్షోభం, వెనెజువెలాలో ప్రభుత్వ మార్పు ఇలా పలు కారణాలతో అనిశ్చితి నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర బ్యాంకులు కూడా బంగారం నిల్వల్ని క్రమంగా పెంచుకుంటున్నాయి. మరోవైపు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ.. భవిష్యత్తులోనూ తగ్గించనున్నట్లు సంకేతాలు ఇస్తుండటం వంటివి బంగారం ధరల్ని ఆల్ టైమ్ హైకి చేర్చాయి. ఇటీవల ఇంటర్నేషనల్ మార్కెట్లో, అదే విధంగా దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరాయి. అయితే . దేశీయంగా హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్స్ పసిడి ధర ఇవాళ రూ. 200 తగ్గడంతో తులం రూ. 1,31,450 కి చేరింది. దీనికి ముందటి రోజు రూ. 350 పతనమైంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు చూస్తే ఇవాళ రూ. 220 తగ్గడంతో 10 గ్రాములకు రూ. 1,43,400 వద్ద ఉంది. ముందటి రోజు ఇది రూ. 380 తగ్గింది. బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా దిగొచ్చాయి. ఇవాళ రూ. 4 వేలు తగ్గడంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీకి రూ. 3,06,000 వద్ద ఉంది. . 6 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 42 వేలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,620 డాలర్లపైన ట్రేడవగా.. ఇప్పుడు అది 4,596.75 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. సిల్వర్ రేటు ఔన్సుకు 90.13 డాలర్ల వద్ద ఉంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 90.81 వద్ద కొనసాగుతోంది.