పల్నాడు జిల్లా పిన్నెల్లిలో .. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ విషయమై అధినేత, మోహన్ రెడ్డి.. ప్రభుత్వంపైనా, నా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాజకీయ కక్షతో ఇంకెంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. "చంద్రబాబుగారూ.. మీరు పాలించడానికి అర్హులేనా? రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటారు? ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగం, పొలిటికల్‌ గవర్నెన్స్‌ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త, ఒక దళితుడు, ఒక పేదవాడు అయిన మందా సాల్మన్‌ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు? అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్యచేస్తారా? పైగా సాల్మన్‌పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా? ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది? ఈ ఘటన ముమ్మాటికీ వైయస్సార్‌సీపీని భయపెట్టడానికి, కట్టడిచేయడానికి మీరు, మీ పార్టీవారి ద్వారా, కొంతమంది పోలీసులు ద్వారా చేస్తున్న, చేయిస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగమే. "అంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే, పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందలకొద్దీ వైయస్సార్‌ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని వైఎస్ జగన్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయని వైఎస్ జగన్ ఆరోపించారు. పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడటం ప్రభుత్వం బాధ్యతగా పేర్కొన్న వైఎస్ జగన్.. ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో ఈ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు.చంద్రబాబు చేస్తున్న హింసారాజకీయాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరన్న వైఎస్ జగన్.. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ రోజుఏది విత్తుతారో అదే రేపు పండుతుందన్నది ఎప్పుడూ మరిచిపోకూడదంటూ పరోక్షంగా సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. సాల్మన్‌ కుటుంబానికి వైయస్సార్‌సీపీ అండగా ఉంటూ వారిని ఆదుకుంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పిన్నెల్లిలో ఉద్రిక్తత..మరోవైపు పిన్నెల్లి గ్రామంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కాసు మహేష్ రెడ్డితో పాటుగా పలువురు వైసీపీ నేతలు పిన్నెల్లికి బయల్దేరారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులకు, వైసీపీ నేతలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. సాల్మన్ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.