టీటీడీ కీలక నిర్ణయం.. ప్రత్యేక హెల్ప్ లైన్.. భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ..

Wait 5 sec.

సంబంధించి తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీకి దేశవ్యాప్తంగా పలుచోట్ల కళ్యాణ మండపాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కళ్యాణ మండపాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కళ్యాణ మండపాల నిర్వహణ విషయంలో అభిప్రాయాలను సేకరించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయనుంది. టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈ విషయం మీద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటుపై అధికారులకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు జారీచేశారు. కళ్యాణ మండపాల నిర్వహణపై భక్తుల నుంచి అభిప్రాయాల సేకరణకు హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలన్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. అదే విధంగా స్థానిక శ్రీవారి సేవకుల ద్వారా ప్రత్యక్షంగా కూడా అభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశించారు. అలాగే కళ్యాణ మండపాల నిర్వహణ,, ఏ ఏ సౌకర్యాలు అవసరమో తెలుసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో అధికారులకు సూచించారు. కళ్యాణ మండపాల నిర్వహణ విషయాన్ని ఎఫ్ఎంఎస్ పరిధిలోకి తెస్తే.. మెరుగైన సౌకర్యాల నిర్వహణతో పాటుగా పరిశుభ్రత కూడా వీలవుతుందని టీటీడీ ఈవో అభిప్రాయపడ్డారు కాంపౌండ్ వాల్స్, బాత్రూమ్‌లు ఎలా ఉన్నాయనే అంశంపై భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు. అలాగే కళ్యాణ వేదిక, అలంకరణ వివాహ వేడుకలను నిర్వహించేందుకు అనువుగా ఉన్నాయా లేదా అనే అంశాలను కూడా ఆరా తీయనున్నారు. కళ్యాణ మండపాల వద్ద పార్కింగ్ సౌకర్యం గురించి అభిప్రాయాలు తెలుసుకుంటారు. అలాగే వర్షాకాలంలో లీకేజీలు ఉన్నాయా అనే దానిపై వివరాలు తెలుసుకుంటారు. కల్యాణ మండపాలలో నీటి నిల్వలు, సెక్యూరిటీ వంటి అంశాలపై భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. వీటి ద్వారా టీటీడీ కళ్యాణ మండపాలలో మరింత మెరుగైన సౌకర్యాల ఏర్పాటు చేయవచ్చని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు.